Satya Pal Malik : స‌త్య‌పాల్ మాలిక్ కామెంట్స్ క‌ల‌క‌లం

రాహుల్ గాంధీ బోడో యాత్ర‌కు ప్ర‌శంస‌

Satya Pal Malik :  భార‌తీయ జ‌న‌తా పార్టీలో కంట్లో న‌లుసుగా మారారు మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ స‌త్య పాల్ మాలిక్, ఎంపీ వ‌రుణ్ గాంధీ. వీరిద్ద‌రూ ప్ర‌ధాన మంత్రిని, కేంద్రాన్ని త‌ప్పు ప‌డుతున్నారు. ఆపై నిల‌దీస్తున్నారు.

తాజాగా స‌త్య పాల్ మాలిక్(Satya Pal Malik) చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. గ‌వ‌ర్న‌ర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

భారత్ జోడో యాత్ర పేరుతో సుదీర్ఘ పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు రాహుల్ గాంధీ. రాజ‌కీయాల్లో ఉన్న సంవ‌త్స‌రాల్లో తాను డ‌బ్బు సంపాదించ లేద‌న్నారు.

లేకుంటే త‌న‌పై కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ , ఆదాయ ప‌న్ను శాఖ దాడులు జ‌రిగి ఉండేవ‌ని షాకింగ్ కామెంట్స చేశారు స‌త్య‌పాల్ మాలిక్.

ఇదే స‌మ‌యంలో భార‌త్ జోడో యాత్ర‌లో ముందున్న రాహుల్ గాంధీకి కితాబు ఇచ్చారు. అత‌ను మంచి ప‌ని చేస్తున్నాడ‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు గ‌వ‌ర్న‌ర్.

క‌న్యాకుమారి నుండి కాశ్మీర్ వ‌ర‌కు 3,570 కిలోమీట‌ర్ల మేర ప్ర‌యాణం చేయ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని పేర్కొన్నారు. బులంద్ ష‌హ‌ర్ జిల్లా మూడి బ‌క పూర్ గ్రామంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించారు స‌త్య పాల్ మాలిక్(Satya Pal Malik).

ఇది మంచి ప్ర‌య‌త్న‌మ‌ని, ఆయ‌న‌కు ఈ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ యాత్ర దేశానికి శుభ ఫ‌లితం క‌లుగు చేస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్.

ఇదిలా ఉండ‌గా గ‌వ‌ర్న‌ర్ చేసిన ఈ వ్యాఖ్య‌లు భారతీయ జ‌నతా పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : సైనిక శిబిరానికి బిపిన్ రావ‌త్ పేరు

Leave A Reply

Your Email Id will not be published!