Satya Pal Malik : మాట్లాడ‌కుండా ఉంటే మంచి ప‌ద‌వి – మాలిక్

మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న కామెంట్స్

Satya Pal Malik :  ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన వ్య‌క్తి. ప్ర‌స్తుతం మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ గా ప‌ని చేస్తున్నారు స‌త్య పాల్ మాలిక్. సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డంలో మోస్ట్ పాపుల‌ర్. మాలిక్ ఎవ‌రికీ లొంగ‌డు.

నిజాయితీగా ఉండ‌డం త‌న‌కు ఇష్ట‌మ‌ని చెబుతారు. ప్ర‌భుత్వానికి చెందిన వ్య‌క్తి అయిన‌ప్ప‌టికీ తాను ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తున్నారు ప్ర‌స్తుతం. మోదీని, కేంద్ర బీజేపీ స‌ర్కార్ అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల గురించి బహిరంగంగానే విమ‌ర్శిస్తున్నారు.

ఆపై రైతుల ఉద్య‌మానికి నేరుగా మ‌ద్ద‌తు ఇచ్చారు స‌త్య పాల్ మాలిక్(Satya Pal Malik) . తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మీరు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడ‌కుండా ఉంటే మీకు మంచి పోస్ట్ ఇస్తామ‌ని, అప‌ట్లో త‌న‌కు ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కూడా ఆఫ‌ర్ చేశారంటూ బాంబు పేల్చారు స‌త్య పాల్ మాలిక్.

ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్ర‌ధాని మోదీ నిర్వాకాన్ని ప్ర‌శ్నించింది.

దేశంలో అతి పెద్ద క‌ళాకారుడు ఎవ‌రంటే మీరేన‌ని ఎద్దేవా చేసింది. ఇదే స‌మ‌యంలో కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాల‌ను త‌ప్పు ప‌ట్టారు. ఢిల్లీ లోని రాజ్ ప‌థ్ , క‌ర్త‌వ్య ప‌థ్ ల పేర్ల‌ను మార్చాల‌ని తీసుకున్న నిర్ణ‌యాన్ని తీవ్రంగా అభ్యంత‌రం తెలిపారు స‌త్య‌పాల్ మాలిక్(Satya Pal Malik) .

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను విప‌క్షాల నేత‌ల‌పై దాడి చేసే కంటే ముందు భార‌తీయ జ‌న‌తా పార్టీలో దాడి చేయాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నార‌ని అన్నారు.

Also Read : 10 రోజుల్లో కొత్త పార్టీని ప్ర‌క‌టిస్తా – ఆజాద్

Leave A Reply

Your Email Id will not be published!