4 Terrorists Killed : పోషియాన్ లో న‌లుగురు ఉగ్ర‌వాదులు ఖ‌తం

నిషేధిత జైషే మ‌హ్మ‌ద్ తో టెర్ర‌రిస్టుల‌కు సంబంధం

4 Terrorists Killed : ఓ వైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా జ‌మ్మూ కాశ్మీర్ లో ప‌ర్య‌టిస్తుండ‌గా మ‌రో వైపు ఉగ్ర‌వాదుల ఏరివేత కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉన్న‌ది. భార‌త ఆర్మీ క్యాంపుపై టెర్ర‌రిస్టు మూక‌ల దాడితో పోలీస్ ఉన్న‌తాధికారి ప్రాణాలు కోల్పోగా మ‌రో ఆర్మీ జ‌వాన్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.

మ‌రో వైపు జ‌మ్మూ కాశ్మీర్ జైళ్ల శాఖ డీజీ దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. తాజాగా బుధ‌వారం జ‌రిగిన ఎన్ కౌంట‌ర్ లో న‌లుగురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. క‌శ్మీర్ లోని పోషియాన్ లో జ‌రిగిన ఎన్ కౌంట‌ర్ లో న‌లుగురు(4 Terrorists Killed) ఖ‌త‌మయ్యారు. న‌లుగురు తీవ్ర‌వాదుల్లో ముగ్గురు తీవ్ర‌వాద సంస్థ జైషే మ‌హ్మ‌ద్ తో సంబంధం క‌లిగి ఉన్నార‌ని , నాల్గో టెర్ర‌రిస్ట్ ల‌ష్క‌రే తోయిబాతో సంబంధం క‌లిగి ఉన్నార‌ని పోలీసులు తెలిపారు.

పోషియాన్ లోని ద్రాచ్ , మూలు ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు వేర్వేరుగా ఆర్మీ ఆప‌రేష‌న్లు ప్రారంభించాయ‌ని వెల్ల‌డించారు అద‌న‌పు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ . ఈ విష‌యాన్ని అధికారికంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు. పోషియాన్ లోని ద్రాచ్ లో జ‌రిగిన కాల్పుల్లో మ‌ర‌ణించిన ముగ్గురు జైష్ ఉగ్ర‌వాదుల్లో ఇద్ద‌రు హ‌స‌న్ బిన్ యాకూబ్ , జంషెడ్ లుగా గుర్తించారు.

ఇటీవ‌ల పుల్వామాలో ప్ర‌త్యేక పోలీసు అధికారి, కార్మికుడిని హ‌త్య చేసిన సంఘ‌ట‌న‌లో పాల్గొన్నార‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా మంగ‌ళ‌వారం రాత్రి, బుధ‌వారం ఉద‌యం పోషియాన్ లోని ద్రాచ్ , మూలు ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు వేర్వేరుగా కార్య‌క‌లాపాలు ప్రారంభించాయి. మూలూరులో జ‌రిగిన ఎన్ కౌంట‌ర్ ఇంకా కొన‌సాగుతోంద‌ని తెలిపారు.

Also Read : టెర్ర‌రిస్టుల‌కు అంత సీన్ లేదు – షా

Leave A Reply

Your Email Id will not be published!