Rahul Gandhi Run : రాహుల్ గాంధీ వెంట సిద్ద‌రామ‌య్య ర‌న్

సోష‌ల్ మీడియాలో యాత్ర ఫోటోలు వైర‌ల్

Rahul Gandhi Run : రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర క‌ర్ణాట‌క‌లో కొన‌సాగుతోంది. ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ యాత్ర‌లో పాల్గొన్నారు. ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌కు వేదికైంది జోడో యాత్ర‌. త‌న త‌ల్లి షూస్ లేస్ పోవ‌డంతో వాటిని రాహుల్ గాంధీ స‌రి చేశారు. ఇదే స‌మ‌యంలో రాహుల్ గాంధీ ప‌రుగులు తీశారు.

ఆయ‌న వెంట క‌ర్ణాట‌క మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌, క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ డీకే శివ‌కుమార్ , త‌దిత‌ర సీనియ‌ర్ నాయ‌కులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ అక‌స్మాత్తుగా సిద్ద‌రామ‌య్య ఎడ‌మ చేతిని ప‌ట్టుకుని ప‌రుగులు తీయ‌డం పార్టీ శ్రేణుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు హ‌ల్ చ‌ల్ అయ్యాయి.

ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మీడియా ఇన్ చార్జ్ జైరాం ర‌మేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర కేంద్ర ప్ర‌భుత్వానికి, మోదీకి కోలుకోలేని షాక్ ఇస్తోంద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ అనుకోకుండా ప‌రుగులు తీయ‌డంతో(Rahul Gandhi Run) పెద్ద ఎత్తున మోహ‌రించిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఒక్క‌సారిగా విస్తు పోయారు.

అక‌స్మాత్తుగా అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. గాంధీని ఆపేందుకు శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నించినా రాహుల్ మాత్రం ప‌ట్టించు కోలేదు. వ‌య‌సు మీద ప‌డినా మాజీ ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య ఎక్క‌డా త‌గ్గ‌లేదు. యువ నాయ‌కుడైన రాహుల్ గాంధీతో పాటు ప‌రుగులు తీసేందుకు పోటీ ప‌డ్డారు. ప్ర‌స్తుతం రాహుల్ చేప‌ట్టిన యాత్ర క‌న్న‌డ నాట హాట్ టాపిక్ గా మారింది.

Also Read : పార్టీలో జ‌నాద‌ర‌ణ సూప‌ర్ – శ‌శి థ‌రూర్

Leave A Reply

Your Email Id will not be published!