Brijlal Khabri : రాహుల్ గాంధీ అంటేనే భారత్ – యూపీ చీఫ్
బ్రిజ్ లాల్ ఖబ్రీ సంచలన వ్యాఖ్యలు
Brijlal Khabri : ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా కొత్తగా ఎన్నికైన బ్రిజ్ లాట్ ఖబ్రీ(Brijlal Khabri) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీని ప్రశంసలతో ముంచెత్తారు. రాహుల్ గాంధీ అంటేనే భారత్ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గతంలో బహుజన్ సమాజ్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఖబ్రీ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఖబ్రీ మీడియాతో మాట్లాడారు. యూపీ లోని మొత్తం 80 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు పెద్ద ఎత్తున ప్రజాదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు బ్రిజ్ లాల్ ఖబ్రీ. రాహుల్ గాంధీని మించిన భారతీయుడు లేనే లేడంటూ కితాబు ఇచ్చారు.
దేశాన్ని రక్షించడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ దేవ్ కాంత్ బరూహ్ గతంలో ఇండియా ఈజ్ ఇందిరా గాంధీ ఇందిరా ఈజ్ ఇండియా అని కామెంట్ చేశారు. అప్పట్లో ఈ కామెంట్ కొటేషన్ గా మారి పోయింది. ప్రస్తుతం యూపీ పార్టీ చీఫ్ బ్రిజ్ లాల్ ఖబ్రీ(Brijlal Khabri) చేసిన వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి.
బీజేపీ చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్నారు. భారత్ అనేది జిల్లా కాదు లేదా రాష్ట్రం కాదు. ఇది రాష్ట్రాలతో కూడిన యూనియన్ . రాహుల్ గాంధీ యాత్రతో 13 వేల రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. ఒక పెద్ద లక్ష్యాన్ని ముందు పెట్టుకున్నారని తెలిపారు. ఇక దేశాన్ని అమ్మేయాలని, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Also Read : ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేస్తా