CM Bommai : పార్టీ ఉనికి కోస‌మే రాహుల్ గాంధీ యాత్ర

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సీఎం బొమ్మై

CM Bommai : రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు క‌ర్ణాట‌క సీఎం బ‌స్వ‌రాజ్ బొమ్మై. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంద‌న్నారు. దేశ వ్యాప్తంగా కాషాయం అల్లుకు పోయింద‌ని త‌మ‌ను త‌ట్టుకునే స‌త్తా ఏ పార్టీకి లేద‌న్నారు.

ఈ త‌రుణంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న త‌న పార్టీని బ‌తికించేందుకు , ఉనికి చాటేందుకు మాత్ర‌మే రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టార‌ని ఎద్దేవా చేశారు సీఎం. తాము ఎవ‌రి యాత్ర‌ల‌ను ప‌ట్టించుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా క‌ర్ణాట‌క‌లో తిరిగి ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు బొమ్మై(CM Bommai).

కాంగ్రెస్ పార్టీ ఇంత కాలం ఏం చేసిందో ప్ర‌జ‌ల‌కు చెప్ప‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ నేత‌లు దేనికైనా సిద్దంగా ఉంటార‌ని ఆరోపించారు. రాహుల్ గాంధీ త‌న కోసం, పార్టీ ఉనికి కోసం మాత్ర‌మే యాత్ర చేప‌ట్టారు. కానీ ప్ర‌జ‌ల కోసం కాద‌ని మండిప‌డ్డారు బొమ్మై.

ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ త‌మిళ‌నాడు లోని క‌న్యాకుమారి నుంచి యాత్ర చేప‌ట్టారు. కేర‌ళలో ముగిసింది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌కు చేరుకుంది. ఈ సంద‌ర్బంగా రాహుల్ గాంధీ క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అవినీతి, అక్ర‌మాల‌కు రాష్ట్ర స‌ర్కార్ కేరాఫ్ గా మారింద‌ని మండిప‌డ్డారు.

దీనిపై స్పందించిన బొమ్మై రాహుల్ గాంధీకి అంత సీన్ లేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా బొమ్మై చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు మండిప‌డ్డారు.

Also Read : అమిత్ షాకు అంత సీన్ లేదు – నితీశ్

Leave A Reply

Your Email Id will not be published!