Perni Nani : గూండాలు జ‌న‌సేన‌లోనే ఉన్నారు – పేర్ని నాని

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అంత సీన్ లేదు

Perni Nani : వైసీపీ నేత‌ల్ని టార్గెట్ చేస్తూ బూతుల‌తో రెచ్చి పోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani). మంగ‌ళ‌వారం గుంటూరు జిల్లా తాడేప‌ల్లిగూడెంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బెదిరింపులకు తాము భ‌య‌ప‌డే వాళ్లం కాద‌న్నారు. వైసీపీలో గూండాలు లేర‌ని జ‌న‌సేన‌లోనే ఉన్నార‌ని ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌న్నారు.

ర‌ణ రంగంలోకి దిగితే ఎవ‌రి స‌త్తా ఏమిటో తేలుతుంద‌న్నారు. ఎవ‌రో రాసి ఇచ్చిన స్క్రిప్టు చ‌దివే నీకు వైసీపీని విమ‌ర్శించే నైతిక హ‌క్కు లేద‌న్నారు పేర్ని నాని. ప్ర‌స్తుతం భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌టీఫ్ చేసుకుని మెల్ల‌గా టీడీపీతో దోస్తీ క‌ట్టేందుకు త‌మ‌ను టార్గెట్ చేశారంటూ మండిప‌డ్డారు.

ఇప్ప‌టికే ఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(CM Jagan) సునామీకి అంతా కొట్టుకు పోయార‌ని నీవు ఓ లెక్కా అంటూ ఎద్దేవా చేశారు. స్థాయిని మ‌రిచి మాట్లాడ‌టం స‌రి కాద‌న్నారు. సినిమాల్లో డైలాగులు చ‌దివినంత సుల‌భం కాదు రాజ‌కీయం చేయ‌డం అంటే కొంచెం త‌గ్గితే మంచిందని సూచించారు పేర్ని నాని. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌య‌ట‌కు మాట్లాడేది ఒకటి అని కాని లోప‌ల చేసేది మ‌రొక‌టి అని మండిప‌డ్డారు.

ఈరోజు వ‌ర‌కు రాష్ట్రం కోసం ఏం కావాలో తెలుసుకోలేని ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాయ‌కుడు ఎలా అవుతాడ‌ని ప్ర‌శ్నించారు మాజీ మంత్రి. చంద్ర‌బాబు నాయుడితో చెట్టాప‌ట్టాల్ వేసుకుని తిరిగే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని జోష్యం చెప్పారు. ఇప్ప‌టికైనా త‌న ముసుగు బ‌య‌ట పెట్టార‌ని అన్నారు పేర్ని నాని(Perni Nani).

Also Read : ప‌వ‌ర్ స్టార్ తో చంద్ర‌బాబు భేటీ

Leave A Reply

Your Email Id will not be published!