Chandrababu Naidu : ప‌వ‌ర్ స్టార్ తో చంద్ర‌బాబు భేటీ

క‌ళ్యాణ్ పోరాటానికి సంపూర్ణ మ‌ద్ద‌తు

Chandrababu Naidu : జ‌నసేన పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో భేటీ అయ్యారు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu). ఆయ‌న క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. వైఎస్సార్సీపీకి వ్య‌తిరేకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న పోరాటానికి తాను సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు హామీ ఇచ్చారు.

మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ లోని నోవాటెల్ హోట‌ల్ లో బ‌స చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) ను స్వ‌యంగా క‌లిశారు చంద్ర‌బాబు నాయుడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశాఖ‌ప‌ట్నంలో ఉండ‌గా చంద్రబాబు ఫోన్ చేశారు. వైజాగ్ లో జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను అరెస్ట్ చేయ‌డం, అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు టీడీపీ చీఫ్‌.

వైసీపీ ప్ర‌భుత్వం కావాల‌ని వేధింపుల‌కు పాల్ప‌డుతోందంటూ ఆరోపించారు. ఇదే స‌మ‌యంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిసి త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం, వేధింపుల‌కు పాల్ప‌డ‌డం , బూతులు మాట్లాడ‌టం వైసీపీ నేత‌లు, ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు ఒక అల‌వాటుగా మారింద‌ని మండిప‌డ్డారు చంద్ర‌బాబు నాయుడు.

అస‌భ్య ప‌ద‌జాలాన్ని ఖండించారు. చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్ర‌తిప‌క్షాల‌కు పోలీసులు నోటీసులు ఇస్తున్నారంటూ చంద్ర‌బాబు నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైఎస్సార్సీపీపై ఐక్యంగా పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌తిప‌క్షాలు క‌లిసి రావాల‌ని టీడీపీ చీఫ్ పిలుపునిచ్చారు.

త‌న‌ను క‌లిసి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు నాయుడికి ధ‌న్య‌వాదాలు తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సంద‌ర్భంగా. ఇదిలా ఉండ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై నిప్పులు చెరిగారు పేర్ని నాని. ప‌వ‌న్ కు అంత సీన్ లేద‌న్నారు.

Also Read : ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడ‌తా – ప‌వ‌న్

Leave A Reply

Your Email Id will not be published!