Bandi Sanjay KCR : కేసీఆర్ కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది – బండి

బీజేపీ స్టేట్ చీఫ్ సంచ‌ల‌న కామెంట్స్

Bandi Sanjay KCR : భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్‌, క‌రీనంగ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌న్నారు(Bandi Sanjay KCR). గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నియోజ‌క‌వర్గంలో ఒక్కో ఓటుకు రూ. 15 వేల చొప్పున పంచుతున్నారంటూ ఆరోపించారు.

ధ‌న బ‌లంతో గెల‌వాల‌ని అనుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. రాజ‌గోపాల్ రెడ్డి గెల‌వ‌డం ఖాయ‌మ‌ని తేలి పోయింది. దీంతో త‌ట్టుకోలేక అక్ర‌మ ప‌ద్ద‌తుల్లో ఎలాగైనా గెల‌వాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ పై ఒత్త‌డి తీసీసుకు వ‌చ్చారంటూ ధ్వ‌జ‌మెత్తారు బండి సంజ‌య్.

నా అరెస్ట్ కు అంత ప్ర‌యారిటీ ఇవ్వ‌వ‌ద్దంటూ మీడియా సంస్థ‌ల‌కు హెచ్చ‌రించారంటూ సీఎంపై మండిప‌డ్డారు. స్థానికేత‌రులు ఉన్నార‌ని చెప్పినా ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవ‌న్నారు. పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు స్వ‌యంగా ద‌గ్గ‌రుండి త‌మ వారిపై దాడుల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఆరోపించారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్.

ప్రస్తుతం ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని కోల్పోయిన టీఆర్ఎస్ గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో అక్ర‌మ ప‌ద్ద‌తులు అవ‌లంభిస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. త‌మ వారిపై దాడుల‌కు తెగ‌బ‌డినా సంయ‌మ‌నం కోల్పోలేద‌న్నారు. నిన్న త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై దాడికి దిగార‌ని ఆరోపించారు.

ఇవ‌న్నీ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు. ఇక్క‌డ ఓట‌ర్ల కంటే స్థానికుల కంటే రాష్ట్రానికి చెందిన ప‌లు ప్రాంతాల్లోని వారంతా ఇక్క‌డ మ‌కాం వేశార‌ని, ఓట్లు వేసేంత వ‌ర‌కు ప్ర‌భావితం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలోని పోలీసులు, ఎన్నిక‌ల క‌మిష‌న్ పూర్తిగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ఆధీనంలో న‌డుస్తున్నాయంటూ ఆరోపించారు.

Also Read : పార్టీ ఆఫీసుకు బండి సంజ‌య్ త‌ర‌లింపు

Leave A Reply

Your Email Id will not be published!