Amit Malviya Owaisi : టిప్పు సుల్తాన్ స‌మ‌ర యోధుడు కాదు

బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా

Amit Malviya Owaisi : మ‌రో వివాదానికి తెర తీశారు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఐటీ హెడ్ అమిత్ మాల్వియా. టిప్పు సుల్తాన్ అనాగ‌రికుడు అని, స్వాతంత్ర స‌మ‌ర యోధుడు కాదంటూ పేర్కొన్నారు.

శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా అమిత్ మాల్వియా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. దీనిపై ఎంఐఎం చీఫ్ ఓవైసీ సీరియ‌స్ అయ్యారు. క‌ర్ణాట‌క లోని ఈద్గా మైదానంలో ఎంఐఎం ఆధ్వ‌ర్యంలో టిప్పు సుల్తాన్ జ‌యంతిని నిర్వ‌హించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు అమిత్ మాల్వియా.

ఆయ‌న దేశం కోసం పాటు ప‌డ‌లేద‌ని, జ‌యంతిని నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు. కాగా రాజ‌కీయీ పూర్వీకులు అయిన ఓవైసీ నుండి ఇంత‌కు మించి ఏమీ ఆశించ లేమ‌ని ఎద్దేవా చేశారు అమిత్ మాల్వియా.

తెలంగాణ‌లో ముఖ్యంగా ఆనాటి హైద‌రాబాద్ లో రజాక‌ర్లు సాగించిన దారుణ మార‌ణకాండ ను ఎలా మ‌రిచి పోగ‌ల‌మ‌ని గుర్తు చేశారు. ఇలాంటి సంద‌ర్భంగా ఎంపీ ఓవైసీ నుంచి ఏం ఆశించ‌గ‌ల‌మ‌ని ప్ర‌శ్నించారు మాల్వియా(Amit Malviya Owaisi) .

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో టిప్పు సుల్తాన్ జ‌యంతి ఉత్స‌వాలు చేప‌డ‌తామ‌ని మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య ప్ర‌క‌టించారు. డిసెంబ‌ర్ 1న టిప్పు సుల్తాన్ జ‌యంతి ఉన్న‌ప్ప‌టికీ న‌వంబ‌ర్ 10న జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక టిప్పు సుల్తాన్ జ‌యంతిని పూర్తిగా ర‌ద్దు చేసింది. ఈ త‌రుణంలో ఎంఐఎం జ‌యంతి జ‌ర‌ప‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాడు అమిత్ మాల్వియా.

మాల్వియా చేసిన ట్వీట్ పై నిప్పులు చెరిగారు ఎంపీ ఓవైసీ.

Also Read : న‌ళినితో స‌హా ఆరుగురు విడుద‌ల – సుప్రీం

Leave A Reply

Your Email Id will not be published!