Priyanka Chaturvedi : కౌశ‌ల్ కిషోర్ పై ప్రియాంక సీరియ‌స్

మ‌హిళా జాతిని అవ‌మానిస్తారా

Priyanka Chaturvedi : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఢిల్లీ హ‌త్య కేసు విష‌యంలో మంత్రి కౌశ‌ల్ కిషోర్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఈ సంద‌ర్బంగా శివ‌సేన ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది(Priyanka Chaturvedi) సీరియ‌స్ గా స్పందించారు. కేంద్ర మంత్రివ‌ర్గంలో కీల‌క ప‌ద‌వి నిర్వ‌హిస్తున్న కౌశ‌ల్ కిషోర్ ఇలాంటి చౌక‌బారు వ్యాఖ్య‌లు ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించారు.

గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈ దేశంలో మ‌హిళ‌ల ప‌రిస్థితి దారుణంగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌ధానంగా న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం కొలువు తీరాక మ‌హిళ‌ల ప‌రిస్థితి రోజు రోజుకు దిగ‌జారి పోతోంద‌ని పేర్కొన్నారు.

మొన్న‌టికి మొన్న గుజ‌రాత్ లో సామూహిక రేప్ కు గురైన బిల్కిస్ బానో కేసులో జీవిత ఖైదుకు గురైన 11 మంది నిందితుల‌ను ఆ రాష్ట్ర స‌ర్కార్ విడుద‌ల చేసింద‌ని , దీనికి కేంద్రం స‌పోర్ట్ చేయ‌డం సిగ్గు చేటు అని పేర్కొన్నారు.

ప్ర‌తి ఒక్క‌రు ఏ ఘ‌ట‌న జ‌రిగినా ముందుగా పురుషుల పాత్ర ఉన్నా మ‌హిళ‌ల‌నే నిందిస్తున్నార‌ని ఇది ఒక అల‌వాటుగా మారింద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఢిల్లీ ఘ‌ట‌న‌లో శ‌ద్దా వాక‌ర్ ను అత్యంత దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న‌లో భాదితురాలిని నిందించ‌డం దారుణ‌మ‌న్నారు.

వెంట‌నే క్యాబినెట్ లో కౌశ‌ల్ కిషోర్( Kaushal Kishore) ను వెంట‌నే తొల‌గించాల‌ని ప్రియాంక చ‌తుర్వేది డిమాండ్ చేశారు. ఇదిలా ఉండ‌గా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రేమ‌లో ప‌డితే ముందుగా పెళ్లి చేసుకోవాల‌ని ఈ లివ్ ఇన్ రిలేష‌న్ ఏమిటంటూ మండిప‌డ్డారు.

ఇలా ఉండ‌డం వ‌ల్ల‌నే నేరాలు జ‌రుగుతున్నాయంటూ మండిప‌డ్డారు.

Also Read : కౌశ‌ల్ కిషోర్ కామెంట్స్ పై క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!