Akhilesh Yadav : భార్య కోసం మామ‌ను క‌లిసిన అల్లుడు

శివ‌పాల్ యాద‌వ్ ను క‌లిసిన అఖిలేష్

Akhilesh Yadav : రాజ‌కీయాలలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం. ప‌వ‌ర్ అలాంటిది. దాని కోసం ఏ పార్టీలో ఎవ‌రు ఎప్పుడుంటారో ఎవ‌రు ఎప్పుడు క‌లుస్తారో చెప్ప‌లేం. తాజాగా యూపీలో బ‌ల‌మైన పార్టీగా పేరుంది స‌మాజ్ వాది పార్టీకి. ఇటీవ‌లే ఆ పార్టీ ఫౌండ‌ర్ , మాజీ సీఎం ములాయం సింగ్ యాద‌వ్ మ‌ర‌ణించారు.

దీంతో త‌న‌యుడు ప్ర‌స్తుత పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ త‌న భార్య డింపుల్ యాద‌వ్(Dimple Yadav) ను రంగంలోకి దింపాడు. మెయిన్ పురి లోక్ స‌భ ఉప ఎన్నిక‌కు సంబంధించి ఇప్ప‌టికే నామినేష‌న్ దాఖ‌లు చేశాడు. డిసెంబ‌ర్ 5న ఉప ఎన్నిక పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మ‌రో వైపు యోగి ఆదిత్యానాథ్ రెండోసారి సీఎం కావ‌డంతో రాష్ట్రంలో ప్ర‌తిపక్షాల‌ను లేకుండా చేయాల‌నే ప్లాన్ తో ముందుకు వెళుతున్నాడు.

ప్ర‌ధానంగా స‌మాజ్ వాది పార్టీకి బ‌ల‌మైన వ్య‌క్తులు, సంస్థ‌ల‌పై దెబ్బ కొడుతూ వ‌స్తుండ‌డంతో అఖిలేష్ యాద‌వ్ చాలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఈ త‌రుణంలో మెయిన్ పురిలో ఎలాగైనా త‌న భార్య డింపుల్ ను గెలిపించు కోవాల‌ని పావులు క‌దుపుతున్నాడు.

ఇందులో భాగంగా త‌న మామ శివపాల్ యాద‌వ్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశాడు అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav ). ఉప ఎన్నిక‌ల్లో త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని, అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని కోరాడు.

విచిత్రం ఏమిటంటే అఖిలేష్ తో పాటు భార్య డింపుల్ యాద‌వ్ కూడా ఉండ‌డం విశేషం. ప్ర‌స్తుతం శివ పాల్ సింగ్ యాద‌వ్ పీఎస్పీఎల్ చీఫ్ గా ఉన్నారు.

ఇఇలా ఉండ‌గా మెయిన్ పురి ఎస్పీకి కంచుకోటా ఉంది. నేతాజీతో పాటు కుటుంబ పెద్ద‌ల ఆశీర్వాదం మాకు త‌ప్ప‌క ఉంటుందంటూ ట్వీట్ చేశారు అఖిలేష్ యాద‌వ్.

Also Read : కౌశ‌ల్ కిషోర్ పై ప్రియాంక సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!