SC Rejects NIA : ఎన్ఐఏకు సుప్రీం షాక్ నవ్లాఖాకు ఊరట
సామాజిక ఉద్యమకారుడిగా గుర్తింపు
SC Rejects NIA : ప్రముఖ ఉద్యమకారుడు గౌతమ్ నవ్లాఖాకు ఊరట లభించింది. తన ఆరోగ్యం బాగో లేదని బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అభ్యంతరం తెలిపింది ఎన్ఐఏ(SC Rejects NIA) . ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందంటూ విన్నవించింది కోర్టుకు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎన్ఐఏ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.
గృహ నిర్బంధం చేయాలనే ఉత్తర్వును రీకాల్ చేయాలనడం భావ్యం కాదని అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా మావోయిస్టులు, పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు కలిగి ఉన్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు గౌతం నవ్లాఖా. విచారణ చేపట్టిన ధర్మాసనం ఎన్ఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వెంటనే 24 గంటల్లోపు గౌతం నవ్లాఖాను గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. ప్రాసిక్యూషన్ కోర్టు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జస్టిస్ లు కేఎం జోసెఫ్ , హృషి కేష్ రాయ్ లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 10న జారీ చేసిన తమ ఆర్డర్ తక్షణమే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.
కాగా నవ్లాఖాను గృహ నిర్బంధంలో ఉంచే భవనం వద్ద అదనపు భద్రతా చర్యలు చేపట్టాలని ధర్మాసనం ఎన్ఐఏను ఆదేశించింది. ఎల్గార్ పరిషత్ – మావోయిస్ట్ లింక్ కేసుకు సంబంధించి నవీ ముంబై లోని తలోజా జైలులో నవ్లాఖా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్య చికిత్స కోసం ఆదేశాలు జారీ చేసింది కోర్టు.
ఈ సందర్భంగా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గౌతమ్ నవ్లాఖా కంటే కరుడు గట్టిన నేరస్థులు దేశంలో చాలా మంది ఉన్నారని పేర్కొంది.
Also Read : ప్రచారానికి దూరం పరాజయం ఖాయం