CJI DY Chandrachud : యుద్ద ప్రాతిపదికన కేసుల విచారణ
ప్రతి రోజూ 10 బెయిల్..10 ట్రాన్స్ ఫర్ పిటిషన్లు
CJI DY Chandrachud : భారత దేశ సర్వోన్నత 50వ ప్రధాన న్యాయమూర్తిగా తాజాగా కొలువు తీరిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI DY Chandrachud) సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన కీలక మార్పులు చేశారు. ఇప్పటికే సంచలన తీర్పులు వెలువరించడంలో ఆయన పేరు పొందారు. ఇందులో భాగంగా ప్రతి రోజు 10 బెయిల్ , 10 ట్రాన్స్ ఫర్ పిటిషన్లను విచారించాలని ఆదేశించారు.
దేశ వ్యాప్తంగా ఆయా కోర్టులలో ఏకంగా 6 లక్షలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటిని పరిష్కరించాలంటే యుద్ద ప్రాతిపదికన విచారణ చేపట్టాలని ఆదేశించారు సీజేఐ. మరో వైపు సుప్రీంకోర్టులో ప్రస్తుతం 13 బెంచ్ లు పని చేస్తున్నాయని తెలిపారు.
ఇందులో భాగంగా కీలక కేసులు విచారణ త్వరితగతిన చేపట్టాలని స్పష్టం చేశారు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్. వచ్చే క్రిస్మస్ పండుగ నాటికి మొత్తం కేసులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో జరిగిన కీలక సమావేశంలో ఈ ప్రకటన చేశారు డీవై చంద్రచూడ్.
విచిత్రం ఏమిటంటే ఉన్నత న్యాయస్థానంలో కుటుంబానికి, వివాహ బంధానికి సంబంధించిన వివాదాలు ఉన్నాయి. ఈ కేసులలో ప్రధానంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానిక బదిలీ చేయాలని కోరేవి ఎక్కువగా ఉండడం గమనార్హం.
ఇవే పెద్ద ఎత్తున కేసులు ఉండడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు సీజేఐ డీవై చంద్రచూడ్(CJI DY Chandrachud). ప్రస్తుతం 3 వేల బదిలీ కేసులు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా 13 బెంచ్ లలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి రోజు 10 కేసులను విచారిస్తే 5 వారాల్లో కేసులు పూర్తవుతాయని అభిప్రాయపడ్డారు సీజేఐ.
Also Read : తీహార్ జైలులో సత్యేంద్ర జైన్ జోష్