Chandrababu Naidu : ప‌వ‌ర్ లోకి వ‌స్తా అంద‌రినీ ఆదుకుంటా

టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు

Chandrababu Naidu : టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. పోల‌వరంలోనే ఏడు మండ‌లాల‌ను క‌లిపేంత వ‌ర‌కు తాను సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోన‌ని ఆనాటి ఎన్డీఏ స‌ర్కార్ కు డెడ్ లైన్ విధించాన‌ని అన్నారు. ఆ మండ‌లాలు ఇవ్వ‌డానికి తానే కార‌ణం అని చెప్పారు. పోలవ‌రం బాధితుల‌ను ఆదుకునే బాధ్య‌త త‌న‌ద‌ని హామీ ఇచ్చారు చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu).

ఇదేం ఖ‌ర్మ పేరుతో ఎన్నిక‌ల ప్ర‌చారం చేప‌ట్టారు టీడీపీ చీఫ్. పోల‌వ‌రం ప్రాజెక్టు త‌మ హ‌యాంలోనే 74 శాతానికి పైగా పూర్త‌యింద‌ని అన్నారు. అయితే ప్ర‌స్తుత వైసీపీ స‌ర్కార్ అంచ‌నాలు పెంచి ఆల‌స్యం చేస్తోంద‌ని ఆరోపించారు.

ప్ర‌స్తుతం ఆ ప్రాజెక్టును ప‌ట్టించు కోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు. రివ‌ర్స్ టెండ‌రింగ్ పేరుతో ప్రాజెక్టును జ‌గ‌న్ రెడ్డి స‌ర్వ నాశ‌నం చేశాడంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఇదిలా ఉండ‌గా ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన చంద్ర‌బాబును(Chandrababu Naidu) పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో ఆయ‌న ఖాకీల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని, త‌న‌ను అడ్డుకోవ‌డం ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు చంద్ర‌బాబు నాయుడు. ఏ కార‌ణంతో పోలీసులు త‌నను అడ్డుకున్నారో చెప్పాల‌న్నారు.

తాను బాధితుల‌ను క‌లిసేందుకు వెళుతున్నాన‌ని దీనికి ప‌ర్మిష‌న్ తీసుకోవాలా అని ప్ర‌శ్నించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద న్యాయం చేసే బాధ్య‌త త‌న‌ద‌ని అన్నారు చంద్ర‌బాబు నాయుడు. కావాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ త‌న‌ను అడ్డుకుంటోంద‌న్నారు.

Also Read : చివ‌రి అవకాశం లేక పోతే మీకే న‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!