Bandi Sanjay : అరెస్ట్ భ‌యం క‌విత నాట‌కం – బండి సంజ‌య్

బిడ్డ‌ను ర‌క్షించుకునేందుకు కేసీఆర్ ప్లాన్

Bandi Sanjay : భార‌తీయ జ‌న‌తా పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్(Bandi Sanjay) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత త‌ప్పించు కునేందుకే నాట‌కం ఆడుతోంద‌ని ఆరోపించారు. త‌ప్పు చేయ‌క పోతే ఎందుకు విచార‌ణ‌కు హాజ‌రు కావ‌డం లేద‌న్నారు.

రాష్ట్రంలో, దేశంలో ఎంతో మంది ప్ర‌జా ప్ర‌తినిధులు, మంత్రులు ఉన్నార‌ని కానీ కేవ‌లం క‌విత పేరునే ఎందుకు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింద‌ని ప్ర‌శ్నించారు. సోమ‌వారం నిర్మల్ జిల్లాలో పాద‌యాత్ర చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు బండి సంజ‌య్.

ఇదిలా ఉండ‌గా ఈనెల 6న విచార‌ణ ఎదుర్కోవాల్సి ఉంది. సీబీఐ ఇప్ప‌టికే నోటీసు జారీ చేసింది. కాగా తాను ఎలాంటి విచార‌ణ ఎదుర్కొనేందుకైనా సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు క‌విత‌. అంత‌లోనే రూట్ ఎలా మార్చిందంటూ ప్ర‌శ్నించారు బీజేపీ స్టేట్ చీఫ్‌. ఎఫ్ఐఆర్ లో త‌న పేరు లేద‌ని అందుకే తాను విచార‌ణ‌కు రాలేనంటూ పేర్కొన‌డం అంతా బ‌క్వాస్ అని కొట్టి పారేశారు బండి సంజ‌య్.

ఓ వైపు ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రిస్తానంటూనే మ‌రో వైపు తాను హాజ‌రు కాలేనంటూ పేర్కొడం విడ్డూరంగా ఉంద‌న్నారు బండి సంజయ్(Bandi Sanjay). అంతే కాకుండా హైద‌రాబాద్, బెంగళూరు డ్ర‌గ్స్ కేసు తిరిగి ఓపెన్ చేయాల‌ని డిమాండ్ చేశారు. డ్రగ్స్, లిక్క‌ర్ దందాలో కేసీఆర్ ఫ్యామిలీకి లింకు ఉంద‌ని ఆరోపించారు బండి సంజ‌య్.

విచార‌ణ‌కు వెళ్ల‌కుండా కొత్త డ్రామాల‌కు తెర లేపింద‌ని పేర్కొన్నారు. త‌న బిడ్డ‌ను అరెస్ట్ చేస్తే మ‌రోసారి సెంటిమెంట్ ర‌గిల్చేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ ఎప్పుడు – రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!