MP Vijay Sai Reddy : విజ‌య‌సాయి రెడ్డికి ‘ప్యాన‌ల్’ ఛాన్స్

వైస్ చైర్మ‌న్ ప్యాన‌ల్ లో చోటు

MP Vijay Sai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి మ‌ళ్లీ ఛాన్స్ ద‌క్కింది. పార్ల‌మెంట్ లోని పెద్ద‌ల స‌భ అయిన రాజ్య‌స‌భ వైస్ చైర్మ‌న్ ప్యాన‌ల్ లో చోటు ల‌భించింది. ఇది ఆయ‌న కెరీర్ లో అద్భుత‌మైన గౌర‌వం ద‌క్కిందని చెప్ప‌క త‌ప్ప‌దు. వైసీపీ అధికార ప్ర‌తినిధిగా, పార్టీ వాయిస్ ను వినిపిస్తూ వ‌స్తున్నారు.

అటు రాష్ట్రానికి ఇటు కేంద్రానికి మ‌ధ్య విజ‌య సాయి రెడ్డి(MP Vijay Sai Reddy) వార‌ధిగా ఉన్నారు. ఎప్పుడు ఇబ్బందులు త‌లెత్తినా లేదా రాష్ట్రానికి అన్యాయం జ‌రిగినా త‌న వాయిస్ వినిపిస్తూ వ‌స్తున్నారు. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో విన‌తి ప‌త్రాలు ఇస్తూనే ఇంకో వైపు నిధుల కేటాయింపుల విష‌యంలో రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి ప్ర‌శ్నిస్తున్నారు.

కేంద్ర స‌ర్కార్ ను నిల‌దీస్తున్నారు. ఆయ‌నకు ఆర్థిక అంశాల ప‌ట్ల అపార‌మైన అనుభ‌వం ఉంది. ఇదే స‌మ‌యంలో త‌న‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌డం ఒకింత గొప్ప బాధ్య‌త‌ను పెంచిన‌ట్ల‌యింది. ఈ మేర‌కు ఎంపీ విజ‌య సాయి రెడ్డికి తీపి క‌బురు చెప్పారు ఉప రాష్ట్ర‌ప‌తి, రాజ్య‌స‌భ చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్, రాజ్య‌స‌భ వైస్ చైర్మ‌న్ ప్యాన‌ల్ లో ఎంపీని చేర్చిన‌ట్లు అధికారికంగా వెల్ల‌డించారు.

ఇదే విష‌యాన్ని ఎంపీ విజ‌య సాయి రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి గౌర‌వ ప్ర‌ద‌మైన ప్యాన‌ల్ లో చోటు క‌ల్పించినందుకు ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, రాజ్య‌స‌భ చైర్మ‌న్ ధ‌న్ ఖ‌ర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు ఎంపీ.

Also Read : ద‌మ్ముంటే ‘రాజ‌న్న‌’కు నిధులు తీసుకు రా

Leave A Reply

Your Email Id will not be published!