Kaushal Kishore Emotional : మంత్రి కౌశ‌ల్ కిషోర్ కంట‌త‌డి

మ‌ద్యం మ‌త్తు ప్ర‌మాదమ‌ని వార్నింగ్

Kaushal Kishore Emotional : కేంద్ర మంత్రి కౌశ‌ల్ కిశోర్ కంట త‌డి పెట్టారు. త‌న కొడుకును త‌లుచుకుని క‌న్నీటి(Kaushal Kishore Emotional) ప‌ర్యంత‌మ‌య్యారు. తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆయ‌న ద‌య‌చేసి ఎవ‌రూ మ‌ద్యం, మ‌త్తుకు లోను కావ‌ద్ద‌ని కోరారు. దీని కార‌ణంగా వేలాది మంది విలువైన ప్రాణాలు కోల్పోతున్నార‌ని వాపోయారు.

నా కొడుకు కూడా డ్ర‌గ్స్ కు అల‌వాటు అయ్యాడ‌ని ఆ కార‌ణంగా అత‌డిని ర‌క్షించు కోలేక పోయాన‌ని మ‌రోసారి ప్ర‌స్తావించారు కేంద్ర మంత్రి. త‌న వ్య‌క్తిగ‌త అనుభ‌వాన్ని తెలిపారు. నేను ఎంపీగా ఉన్నా..నా భార్య ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభం. ఇవేవీ నా క‌న్న కొడుకును కాపాడ లేక పోయాయ‌ని అన్నారు కౌశ‌ల్ కిషోర్.

ఇక సామాన్య ప్ర‌జానీకం ఎలా త‌ట్టుకుంటుంద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం ఆయ‌న కేంద్ర గృహ నిర్మాణం, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ మంత్రిగా ఉన్నారు . మ‌ద్యం సేవించే అధికారి కంటే కూలీ, రిక్షా తొక్కే కార్మికులు త‌న‌కు గొప్ప‌గా అనిపిస్తార‌ని చెప్పారు కౌశ‌ల్ కిషోర్ . కూతుళ్లు, సోద‌రీ మ‌ణులు, యువ‌తులు ద‌య‌చేసి డ్ర‌గ్స్ , మ‌ద్యం సేవించే వారిని పెళ్లి చేసుకోవ‌ద్దంటూ కోరారు కేంద్ర మంత్రి.

లంభువా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో డి – అడిక్ష‌న్ పై జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. మ‌ద్యానికి బానిస అయిన వాళ్ల జీవిత‌కాలం చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌న్నారు కౌశ‌ల్ కిషోర్. నా కొడుకు ఆకాశ్ కిషోర్ స్నేహితుల‌తో స‌హవాసం కార‌ణంగా మ‌ద్యానికి అల‌వాటు ప‌డ్డాడు. ఆరు నెల‌ల‌కు పెళ్లి చేసుకున్నాడు.

డి అడిక్ష‌న్ సెంట‌ర్ లో చేర్పించా. ఆరు నెల‌లు బాగున్నాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అల‌వాటు ప‌డ్డాడు. రెండేళ్ల త‌ర్వాత చావుకు కార‌ణ‌మైంద‌ని కంట త‌డి పెట్టారు కౌశ‌ల్ కిషోర్.

Also Read : ఖ‌ర్గే అన్న‌దాంట్లో త‌ప్పేముంది – రౌత్

Leave A Reply

Your Email Id will not be published!