Pragya Singh Thakur : ఇళ్ల‌ల్లో క‌త్తుల‌కు ప‌దును పెట్టండి – ప్ర‌గ్యా

బీజేపీ ఎంపీ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్

Pragya Singh Thakur : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ప్ర‌గ్యా ఠాకూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారారు. దేశంలో హిందువుల‌పై దాడులు పెరిగి పోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆత్మ ర‌క్ష‌ణ కోసం ఇళ్ల‌ల్లో క‌త్తులు పెట్టుకోవాలంటూ పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం ఆమె చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఈ దేశంలో ప్ర‌తి ఒక్క‌రికి తమ‌ను తాము ర‌క్షించుకునే హ‌క్కు ఉంద‌న్నారు ప్ర‌గ్యా ఠాకూర్. క‌నీసం త‌మ ఇళ్ల‌ల్లో ఉన్న క‌త్తుల‌కు ప‌దును పెట్టాల్సిన అవ‌స‌రం ఆస‌న్న‌మైంద‌న్నారు. ల‌వ్ జిహాద్ అనేది ఇప్పుడు ఓ వ్యాప‌కంగా మారింద‌న్నారు. మ‌నం మ‌నుషుల్ని ప్రేమిస్తాం. కానీ వాళ్లు హ‌త్య‌ల్ని ఆరాధిస్తారంటూ ఆరోపించారు ఎంపీ ప్ర‌గ్యా ఠాకూర్(Pragya Singh Thakur).

హిందూ జాగ‌ర‌ణ వేదిక ద‌క్షిణ ప్రాంతీయ వార్షిక స‌ద‌స్సులో ప్ర‌గ్యా ఠాకూర్ పాల్గొని ప్ర‌సంగించారు. దేవుడు సృష్టించిన ఈ లోకంలో అణ‌చివేత దారుల‌ను, పాపాత్ములంద‌రినీ అంతం చేయాల‌ని స‌న్యాసి అంటున్నార‌ని, లేక పోతే ప్రేమ‌కు నిజ‌మైన నిర్వ‌చ‌నం ఇక్క‌డ ఉండ‌ద‌న్నారు.

అందుకు సంబంధించిన వారికి స‌మాధానం చెప్పాల‌న్నారు. మీ అమ్మాయిల‌ను ర‌క్షించు కోవాల్సిన బాధ్య‌త మీ అంద‌రిపై ఉంద‌న్నారు. వారికి కుటుంబ విలువ‌ల‌ను నేర్పాల‌ని ప్రగ్యా ఠాకూర్ పిలుపునిచ్చారు. లేక పోతే దేశం నాశ‌న‌మై పోతుంద‌ని హెచ్చ‌రించారు.

శివ మొగ్గ‌కు చెందిన హ‌ర్ష‌తో స‌హా హిందువుల కార్య‌క‌ర్త‌ల హ‌త్య‌ల‌ను ఈ సంద‌ర్బంగా ఆమె ప్ర‌స్తావించారు. స్వీయ ర‌క్ష‌ణ కోసం క‌త్తుల్ని ప‌దును పెట్టుకోవాల‌ని కోరారు.

మీ ఇళ్ల‌లో ఆయుధాలు ఉంచుకోండి. గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో క‌నీసం కూర‌గాయలు కోసే క‌త్తులనైనా ప‌దును పెట్టాల‌న్నారు.

Also Read : కేంద్ర పాలిత ప్రాంతంగా ప్ర‌క‌టించండి

Leave A Reply

Your Email Id will not be published!