Rahul Gandhi : ప‌ప్పు ఎవ‌రో తేలి పోయింది – రాహుల్

నాటి ఇందిరా గాంధీని కూడా వ‌ద‌ల్లేదు

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త‌న‌ను ప‌ప్పు అంటూ ఎద్దేవా చేస్తున్న వాళ్ల‌కు, సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వాళ్ల‌కు సీరియ‌స్ గా స‌మాధానం ఇచ్చారు. ఈ దేశంలో ప‌ప్పు ఎవ‌రో ఫైర్ ఎవ‌రో ప్ర‌జ‌లకు తేలి పోయింద‌న్నారు రాహుల్ గాంధీ.

ఆయ‌న ఓ జాతీయ మీడియా ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో దేశానికి ప్ర‌ధాన‌మంత్రిగా ప‌ని చేసిన నాయ‌న‌మ్మ ఇందిరా గాంధీని కూడా విమ‌ర్శించార‌ని, తాను ఓ లెక్క కాద‌న్నారు. విమ‌ర్శలు గుప్పించ‌డం, ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌ర్వ సాధార‌ణం. ఎందుకంటే రాజ‌కీయాలు మ‌రింత దిగ‌జారుడుత‌నంతో నిండి పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ దేశంలో ఏం జ‌రుగుతుందో అన్న వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ చేయాల‌ని తాను పాద‌యాత్ర చేప‌ట్టాన‌ని చెప్పారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
ఇందిరా గాంధీని గుంగి గుడియా అని ఎద్దేవా చేశార‌ని , త‌న‌ను ప‌ప్పు అంటూ ఎద్దేవా చేశార‌ని కానీ ఇప్పుడు ప‌ప్పు ఎవ‌రో జ‌నం అంచ‌నాకు వ‌చ్చార‌ని దానిని ఎవ‌రూ చెర‌ప‌లేర‌ని అన్నారు.

త‌మ పార్టీ హ‌యాంలో కాపాడుకుంటూ వ‌చ్చిన కోట్లాది రూపాయ‌లు విలువ చేసే సంస్థ‌ల‌ను అప్ప‌నంగా క‌ట్ట‌బెట్టిన ఘ‌న‌త మోదీకే ద‌క్కుతుంద‌న్నారు. వీలైతే అదానీ, అంబానీల‌కు తాజ్ మ‌హ‌ల్ ను కూడా అమ్మేస్తారంటూ మండిప‌డ్డార‌రు రాహుల్ గాంధీ. ప్ర‌స్తుతం నేను బాగున్నాన‌ను. ప‌ప్పు అంటే ఇంకా ఎక్కువ‌గా ఎంజాయ్ చేస్తున్నాన‌ని అన్నారు.

త‌న‌ను పేరు పెట్టే వారంద‌రినీ స్వాగ‌తిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. భార‌త్ జోడో యాత్ర జ‌న‌వ‌రి 3 నుంచి తిరిగి ప్రారంభించ‌నున్నారు రాహుల్ గాంధీ.

Also Read : మోదీ వైఫ‌ల్యం భార‌త్ కు శాపం

Leave A Reply

Your Email Id will not be published!