APPSC Group 1 Exam : ఏపీపీఎస్సీ గ్రూప్ -1 ప్రిలిమ్స్ కు రెడీ

జ‌న‌వ‌రి 8న ప‌రీక్ష‌..హాలిటిక్స్ ల‌భ్యం

APPSC Group 1 Exam : త్వ‌ర‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఓ వైపు తెలంగాణ‌లో నోటిఫికేష‌న్ల జాత‌ర కొన‌సాగుతోంది. కానీ ఒక్క పోస్టు కూడా భ‌ర్తీ చేయ‌లేదు.

కానీ ఏపీలో కొలువు తీరిన వైసీపీ స‌ర్కార్ మాత్రం సీఎం కేసీఆర్ కంటే భిన్నంగా పోస్టుల‌ను నింప‌డంలో ముందంజ‌లో ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఏపీ సీఎం ఏకంగా జాబ్స్ భ‌ర్తీకి సంబంధించి ఇయ‌ర్ క్యాలెండ‌ర్ కూడా ప్ర‌క‌టించారు. 

తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జ‌న‌వ‌రి 8న గ్రూప్ -1 జాబ్స్ కు(APPSC Group 1 Exam) సంబంధించి ప్రిలిమ్స్ (ప్రాథ‌మిక‌) ప‌రీక్ష ను నిర్వ‌హించ‌నుంది.

ఈ మేర‌కు హాల్ టికెట్ల‌ను కూడా డౌన్లోడ్ చేసుకోవాల‌ని అభ్య‌ర్థుల‌కు సూచించింది. ప‌రీక్ష‌కు సంబంధించి ఇప్ప‌టికే ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేసింది. ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు గాను మొత్తం రాష్ట్రంలో 297 ప‌రీక్ష కేంద్రాల‌ను ఏర్పాటు చేసినట్లు ఏపీపీఎస్సీ స్ప‌ష్టం చేసింది. 18 జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది.

ప‌రీక్షా కేంద్రాల గుర్తింపు, ఇత‌ర స‌మాచారం కోసం అభ్యర్థుల‌కు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను ఆయా జిల్లాల క‌లెక్ట‌రేట్ల‌లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసిన‌ట్లు ఆంధ్ర ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ వెల్ల‌డించింది.

ఇక ప‌రీక్ష‌లో భాగంగా 8న ఉద‌యం 10 గంట‌ల నుంచి 12 గంట‌ల వ‌ర‌కు మొద‌టి పేప‌ర్ ఉంటుంద‌ని, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు రెండో పేప‌ర్ కు ప‌రీక్ష జ‌ర‌గ‌నుంద‌ని పేర్కొంది. మొత్తం 92 గ్రూప్ -1 పోస్టుల భ‌ర్తీకి 1,26,449 మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

Also Read : ఆ శాఖ‌లో జాబ్ కొడితే భారీ వేత‌నం

Leave A Reply

Your Email Id will not be published!