Vasantha Krishna Prasad : ‘ఉయ్యూరు’కు వంతపాడిన ‘వ‌సంత’

వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

Vasantha Krishna Prasad : ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ లో మెల మెల్ల‌గా అస‌మ్మ‌తి స్వరం పెరుగుతోంది. ఇప్ప‌టికే ఆనం రామ నారాయ‌ణ రెడ్డి స్వంత పార్టీపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు. తాను ఉన్నంగానే మ‌రో వ్య‌క్తిని ఇంఛార్జ్ గా ఎలా వేస్తారంటూ ప్ర‌శ్నించారు. మ‌రో కేబినెట్ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అయితే ముందు రాజ‌ధాని తేల్చండి లేదా రాష్ట్రం ఇవ్వండి అంటూ ధిక్కార స్వ‌రం వినిపించారు.

తాజాగా మ‌రో నాయ‌కుడు బాంబు పేల్చాడు. అధికార పార్టీకి చెందిన వ‌సంత కృష్ణ ప్ర‌సాద్(Vasantha Krishna Prasad) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సేవ చేసే వారిని రాజ‌కీయాల‌కు అంట‌గ‌ట్ట‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌వాస ఆంధ్రుల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తు వాళ్లు ఎలా ఏపీకి వ‌స్తార‌ని ప్ర‌శ్నించారు.

అయితే గుంటూరులో తొక్కిస‌లాట చోటు చేసుకోవడం బాధాక‌ర‌మ‌న్నారు వసంత కృష్ణ‌ప్ర‌సాద్. జ‌రిగిన ఘ‌ట‌నను తాను స‌మ‌ర్థించ‌డం లేద‌న్నారు. అయితే దానికి బాధ్యుడిని చేస్తూ ఉయ్యూరు ఫౌండేష‌న్ నిర్వాహ‌కుడు ఉయ్యూరు శ్రీ‌నివాస్ ను టార్గెట్ చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు వైసీపీ ఎమ్మెల్యే. ఆయ‌న మంచి వ్య‌క్తి అని, త‌న‌కు చాలా కాలం నుంచి తెలుస‌ని, మంచి మిత్రుడ‌ని పేర్కొన్నారు.

కేవ‌లం ఒక రాజ‌కీయ వేదిక ద్వారా సహాయం చేసుకోవడం వ‌ల్ల టార్గెట్ ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించారు వ‌సంత కృష్ణ ప్ర‌సాద్. పేద‌ల‌కు ఎంతో కాలం నుంచి స‌హాయం చేస్తూ వ‌స్తున్నార‌ని ప్ర‌శంసించారు. ఇదిలా ఉండ‌గా స్వంత పార్టీనే ధిక్కరించి వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఇంకా స్పందించ లేదు పార్టీ చీఫ్‌, ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

Also Read : ఎక్సెల్ గ్రూప్ కంపెనీపై ఐటీ దాడులు

Leave A Reply

Your Email Id will not be published!