Acharya Satyendra Das : రాహుల్ కు రాంమందిర్ పూజారి ప్ర‌శంస‌

విస్తు పోయిన బీజేపీ, అనుబంధ సంస్థ‌లు

Acharya Satyendra Das : కాంగ్రెస్ యువ నాయ‌కుడు, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీపై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురుస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆయ‌న హాట్ టాపిక్ గా మారారు. ఓ వైపు రాహుల్ గాంధీ బీజేపీని, దాని అనుబంధ సంస్థ‌ల‌ను ఏకి పారేస్తుంటే రామ మందిరం ఆల‌య ప్ర‌ధాన పూజారి ఆచార్య స‌త్యేంద్ర దాస్(Acharya Satyendra Das) తో పాటు రామ మందిరం ట్ర‌స్టు కార్య‌ద‌ర్శి చంప‌త్ రాయ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఆ ఇద్దరు ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు రాహుల్ గాంధీని ప్ర‌శంసించారు. తాము ఎన్న‌డూ రాహుల్ యాత్ర‌కు వ్య‌తిరేకంగా కామెంట్స్ చేయ‌లేద‌న్నారు. తాజాగా రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ప్ర‌స్తుతం ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కు చేరుకుంది. ఈ మేర‌కు రాహుల్ ను ఉద్దేశించి ప్ర‌సంశ‌లు కురిపించారు ఆచార్య స‌త్యేంద్ర దాస్ .

ఆయ‌న‌కు సుదీర్ఘ లేఖ కూడా రాయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. భార‌త్ జోడో యాత్ర‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు ఆచార్య స‌త్యేంద్ర దాస్. ఆయ‌న చేప‌ట్టిన యాత్ర దిగ్విజ‌యం కావాల‌ని, ఈ మేర‌కు ఆ శ్రీ‌రాముడి ఆశీస్సులు రాహుల్ గాంధీకి(Rahul Gandhi) అంద‌జేయాల‌ని ఆశీస్సులు అంద‌జేస్తున్న‌ట్లు ఆకాంక్షించారు.

దేశాన్ని ఏకం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్ర‌య‌త్నానికి త‌న మ‌ద్ద‌తు అందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. మీరు పోరాడుతున్న మిష‌న్ స‌క్సెస్ కావాల‌ని ఆశిస్తున్నా.

మీరు ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం , వారి సంతోషం కోసం స‌ర్వ‌జ‌న్ హితై స‌ర్వ‌జ‌న్ సుఖాయ్ అనే ఉదాత్త‌మైన ల‌క్ష్యం కోసం ప‌ని చేస్తున్నారు. ఆ దేవుడి కృప మీకుండాల‌ని కోరుతున్నాన‌ని తెలిపారు.

Also Read : రాహుల్ గాంధీ యాత్ర భేష్

Leave A Reply

Your Email Id will not be published!