Rahul Gandhi Yatra Dog : రాహుల్ యాత్రలో ‘శునక’ రాజసం
సోషల్ మీడియాలో హల్ చల్
Rahul Gandhi Yatra Dog : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఆయన గత ఏడాది 2022 సెప్టెంబర్ 6న భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఆనాటి నుంచి నేటి దాకా వైరల్ అవుతూ వస్తున్నారు. ఇప్పటి దాకా 3 వేల కిలోమీటర్లకు పైగా నడిచారు. ఇంకా పాదయాత్ర చేస్తూనే ఉన్నారు.
కేంద్రాన్ని, ప్రధాన మంత్రిని , బీజేపీని, దాని అనుబంధ సంస్థలను తూర్పార బడుతున్నారు రాహుల్ గాంధీ. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ సైతం విస్తు పోయేలా జనం హాజరవుతున్నారు. రాహుల్ యాత్రకు జేజేలు పలుకుతున్నారు. వేలాది మంది స్వచ్చంధంగా ఆయన వెంట నడుస్తున్నారు.
వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు కూడా హాజరు కావడం విశేషం. ఇదే సమయంలో రా మాజీ చీఫ్ కూడా పాల్గొన్నారు. అంతే కాకుండా ఆర్బీఐ మాజీ చీఫ్ రఘురామ్ రాజన్ కూడా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
రాహుల్ గాంధీకి చిన్నప్పటి నుంచి శునకాలు(Rahul Gandhi Yatra Dog) అంటే చాలా ఇష్టం. శనివారం హర్యానా రాష్ట్రంలో పాదయాత్ర చేస్తుండగా శునక రాజసం వచ్చి చేరింది. ఆయనతో పాటు కొద్ది సేపు పాదయాత్రలో నడిచింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ శునకం పేరు లూనా అని సమాచారం. ఇది విదేశీ జాతికి చెందినది. అది రాహుల్ తో కలిసి నడవడంతో అక్కడున్న జనం ఆసక్తిగా దానిని చూసేందుకు ఎగబడ్డారు.
Also Read : అరుదైన పథకం అందని సాయం
Rahul Gandhi walks with a dog during Bharat Jodo Yatra as it marches ahead in Haryana's Karnal pic.twitter.com/I9Gz6VhZ9R
— Siddhant Anand (@JournoSiddhant) January 7, 2023