Manik Rao Thackeray Tour : 11న ‘ఠాక్రే’ రాక కాంగ్రెస్ కు చికిత్స
షెడ్యూల్ వెల్లడించిన ఏఐసీసీ
Manik Rao Thackeray Tour : తెలంగాణలో సీనియర్లు వర్సెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహారం తీవ్ర దుమారానికి దారి తీయడంతో నిన్నటి దాకా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న మాణిక్కం ఠాకూర్ కు పార్టీ హైకమాండ్ చెక్ పెట్టింది. ఆయన స్థానంలో మరాఠాకు చెందిన సీనియర్ నాయకుడు మాణిక్ రావు ఠాక్రేకు(Manik Rao Thackeray Tour) బాధ్యతలు అప్పగించింది.
ఈ మేరకు ఏఐసీసీ ఠాక్రే టూర్ షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఇందులో భాగంగా గ్రూపులుగా విడి పోయిన పార్టీని ఏ మేరకు గాడిలో పెడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 26 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు భారీ ఆదరణ లభించింది. ఇక మాణిక్ రావు ఠాక్రే పర్యటనకు సంబంధించి జనవరి 11న తెలంగాణకు వస్తారు(Manik Rao Thackeray Tour). రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటిస్తారు. ఉదయం 7.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరుతారు.
అక్కడి నుంచి 9.30 కు ఇక్కడికి వస్తారు. 10 గంటలకు గాంధీ భవన్ లో రివ్యూ చేస్తారు. మొదటి రోజు ఏఐసీసీ బాధ్యులతో సమావేశం ఉంటుంది. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టితో భేటీ అవుతారు. రెండో రోజు డీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. సాయంత్రం తిరిగి ఢిల్లీకి వెళతారు.
ఇక మాణిక్ రావు ఠాక్రే కు అపారమైన రాజకీయ అనుభవం ఉంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎమ్మెల్సీగా , మూడు శాఖలకు మంత్రిగా ఉన్నారు. పీసీసీ చీఫ్ గా కూడా పని చేశారు.
Also Read : నోటిఫికేషన్ల జాతర కొలువులు ఎక్కడ