PM Modi Road Show : బ్ర‌హ్మ‌ర‌థం మోదీపై పూల వ‌ర్షం

హస్తిన‌లో ప్ర‌ధాన‌మంత్రి రోడ్ షో

PM Modi Road Show : దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ రోడ్ షో చేప‌ట్టారు. జ‌నం అడుగ‌డుగునా నీరాజనం ప‌లికారు. జ‌య‌హో మోదీ అంటూ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున పూల వ‌ర్షం కురిపించారు భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు. ఢిల్లీ వీధుల గుండా చేప‌ట్టిన రోడ్ షోకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

సోమ‌వారం భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌ధాని రోడ్ షో(PM Modi Road Show) చేప‌ట్టారు. భారీ స్పంద‌న ల‌భించింది. ఈ రోడ్ షో ప‌టేల్ చౌక్ నుంచి ఎన్డీఎంసీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వ‌ర‌కు సాగింది. ఈ సంద‌ర్భంగా న‌రేంద్ర దామోద‌ర్ దాస్ మోదీకి రోడ్డుకు ఇరు వైపులా సామాన్య ప్ర‌జ‌లు, బీజేపీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

మ‌రో వైపు న‌రేంద్ర మోదీపై పూల వ‌ర్షం కురిపించారు. ఢిల్లీ లోని క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో బీజేపీ రెండు రోజుల జాతీయ కార్య‌వ‌ర్గం స‌మావేశం కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా రోడ్ షో హైలెట్ గా నిలిచింది. సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా ప్ర‌ధాన మంత్రి మారారు. ఢిల్లీలో భార‌తీయ జ‌న‌తా పార్టీ కీల‌క స‌మావేశం జ‌రుగుతోంది.

ఈ స‌మావేశంలో బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డాతో పాటు హోం శాఖ మంత్రి అమిత్ షా , ఇత‌ర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, సీనియ‌ర్లు, పార్టీకి చెందిన ప్ర‌ముఖులు, శాశ్వ‌త ఆహ్వానితులు ఉన్నారు. ఇదిలా ఉండ‌గా జేపీ న‌డ్డా ప‌దవీ కాలాన్ని మ‌రోసారి పొడిగించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : బీజేపీకి సీట్లు త‌గ్గడం ఖాయం – థ‌రూర్

Leave A Reply

Your Email Id will not be published!