Let Terrorists Killed : జ‌మ్మూ కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌

భ‌ద్ర‌తా ద‌ళాల‌పై కాల్పులు

Let Terrorists Killed : జ‌మ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంట‌ర్ చోటు చేసుకుంది. భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. జ‌మ్మూ కాశ్మీర్ లోని బుద్గామ్ లో ల‌ష్క‌రే ఇ తోయిబా ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన ఇద్ద‌రు టెర్ర‌రిస్టులు హ‌త‌మ‌య్యారు. ఆయుధాలు , మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బుద్గామ్ లోని కోర్టు కాంప్లెక్స్ స‌మీపంలో అనుమానాస్ప‌ద వాహ‌నాన్ని ఆపేందుకు భార‌త సైన్యం ప్ర‌య‌త్నం చేసింది.

జ‌మ్మూ కాశ్మీర్ పోలీసుల ఉమ్మ‌డి ప్రాంత ఆధిప‌త్య పార్టీ ప్ర‌య‌త్నించిన స‌మ‌యంలో ఉగ్ర‌వాదులు భ‌ద్ర‌తా ద‌ళాల‌పై కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు టెర్ర‌రిస్టులు ఎన్ కౌంట‌ర్ లో మృతి చెందారు. ఈ ఎన్ కౌంట‌ర్ మంగ‌ళ‌వారం ఉద‌యం చోటు చేసుకుంది. ప్ర‌తీకార కాల్పుల్లో టెర్ర‌రిస్టులు చ‌ని పోయిన‌ట్లు(Let Terrorists Killed) జ‌మ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా ఉగ్ర‌వాదుల‌ను పుల్వామాకు చెందిన అర్బాజ్ మీర్ , షాహిద్ షేక్ లుగా గుర్తించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఈ టెర్ర‌రిస్టులు ఇద్ద‌రూ కేంద్ర ప్ర‌భుత్వం నిషేధించిన ల‌ష్క‌రే ఇ తోయిబా ఉగ్ర‌వాద సంస్థ తో సంబంధం క‌లిగి ఉన్నార‌ని వెల్ల‌డించారు. గ‌త వారం స‌మీపంలోని మాగం ప్రాంతంలో జ‌రిగిన కార్బ‌న్ అండ్ సెర్చ్ ఆప‌రేష‌న్ నుంచి ఉగ్ర‌వాదులు ఇద్ద‌రూ త‌ప్పించుకున్నార‌ని జ‌మ్మూ కాశ్మీర్ అడిష‌న‌ల్ జీపీ విజ‌య్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

హ‌త్య‌కు గురైన అల్ట్రాస్ నుంచి ఏకే రైఫిల్ , పిస్ట‌ల్ స్వాధీనం చేసుకున్నారు. కాగా కాశ్మీరీ హిందువుల‌ను టార్గెట్ చేస్తూ కాల్పుల‌కు పాల్పుడుతూ వ‌స్తున్నారు. గ‌తంలో కంటే ఇప్పుడు కొంత త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : ఆజాద్ పార్టీ క‌నుమ‌రుగు ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!