Adhir Ranjan Chowdhury : మోడీ దీదీ మ‌ధ్య ర‌హ‌స్య ఎజెండా

ఎంపీ అధీర్ రంజ‌న్ చౌద‌రి కామెంట్స్

Adhir Ranjan Chowdhury : కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ అధీర్ రంజ‌న్ చౌద‌రి(Adhir Ranjan Chowdhury) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న టీఎంసీ చీఫ్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ పై నిప్పులు చెరిగారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ బ‌య‌ట‌కు న‌టిస్తున్నార‌ని కానీ టీఎంసీ, బీజేపీ రెండూ ఒక్క‌టేన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆ ఇద్ద‌రు నాయ‌కుల‌ను మో మో అవ‌గాహ‌న క‌లిగి ఉన్నార‌ని పేర్కొన్నారు. అధీర్ రంజ‌న్ చౌద‌రి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆ ఇద్ద‌రి ర‌హ‌స్య ఎజెండా ఉంద‌ని, ఆ ఎజెండా ఏమిటంటే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవ‌డం, దానిని దెబ్బ కొట్టాల‌ని చూడ‌టం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు అధీర్ రంజ‌న్ చౌద‌రి(Adhir Ranjan Chowdhury).

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రానికి ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. గ‌తంలో మోదీని తిడుతూ వ‌చ్చిన మ‌మ‌తా బెన‌ర్జీ ఈ మ‌ధ్య ఎందుకు మౌనంగా ఉందంటూ నిల‌దీశారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్య‌తిరేకంగా, మోదీ చేస్తున్న అస‌మ‌ర్థ పాల‌న‌, ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌ను నిర‌సిస్తూ కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టార‌ని అన్నారు.

దేశం కోసం ఎలాంటి రాజ‌కీయ పార్టీల మ‌ద్ద‌తు లేకుండా సాగిస్తున్న ఈ పాద‌యాత్ర‌లో ఎందుకు మ‌మ‌తా బెన‌ర్జీ పాల్గొన‌లేద‌ని మండిప‌డ్డారు. కేవ‌లం ఆ ఇద్ద‌రి ఎజెండా ఒక్క‌టే..కేవ‌లం కాంగ్రెస్ పార్టీ ఎద‌గ‌కుండా చేయ‌డం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. ఈ దేశంలో మిత్ర‌ప‌క్షాలే కాదు ప్ర‌తిప‌క్షాలు, ప్రధానంగా బీజేపీ , ఆర్ఎస్ఎస్ నాయ‌కులు కూడా రాహుల్ యాత్ర‌ను మెచ్చుకున్నార‌ని కానీ దీదీ ఒక్క ప‌దం ప‌ల‌క‌లేద‌న్నారు అధీర్ రంజ‌న్ చౌద‌రి.

Also Read : మెరుగైన రోడ్లు ప్ర‌మాదానికి దారులు

Leave A Reply

Your Email Id will not be published!