Siddaramaiah : హిందూత్వ‌ ప్ర‌యోగ‌శాల‌గా కోస్తా క‌ర్ణాట‌క‌

సిద్ద‌రామ‌య్య షాకింగ్ కామెంట్స్

Siddaramaiah : క‌ర్ణాట‌క మాజీ సీఎం , సీఎల్పీ నేత సిద్ద‌రామ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రాష్ట్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఆదివారం క‌ర్ణాట‌క లోని ఉడిపిలో మీడియాతో మాట్లాడారు సిద్ద‌రామ‌య్య‌(Siddaramaiah).

భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌న పెట్టింద‌న్నారు. కేవ‌లం మ‌తం ప్రాతిప‌దిక‌న రాజ‌కీయాలు చేస్తోందంటూ మండిప‌డ్డారు.

ఇదే స‌మ‌యంలో కోస్తా క‌ర్ణాట‌క‌ను బీజేపి హిందుత్వ ప్ర‌యోగ‌శాల‌గా మారుస్తోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సిద్ద‌రామ‌య్య‌. అవినీతి, అక్ర‌మాల‌కు ప్ర‌స్తుత బొమ్మై ప్ర‌భుత్వం కేరాఫ్ గా మారింద‌న్నారు. వీరి వేధింపులు త‌ట్టుకోలేక‌, లంచాలు ఇచ్చుకోలేక నానా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

భార‌తీయ జ‌నతా పార్టీ నాయ‌కులు అభివృద్ది స‌మ‌స్య‌ల కంటే ల‌వ్ జిహాద్ గురించి మాట్లాడేందుకు ఎక్కువ‌గా ఇష్ట ప‌డ‌తార‌ని ఎద్దేవా చేశారు సిద్ద‌రామ‌య్య‌. త‌మ పార్టీ అందుకే భార‌త్ జోడో యాత్ర‌ను చేప‌ట్టింద‌న్నారు.

ప్ర‌స్తుతం ప్ర‌ధాన మంత్రి మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జేపీ న‌డ్డా ఎంత మంది వ‌చ్చినా, ఎన్ని వ్యూహాలు ప‌న్నినా ఈసారి వ‌ర్క‌వుట్ కాద‌న్నారు మాజీ సీఎం.

స‌మాజాన్ని విభిజించ‌డ‌మే బీజేపీ ప‌నిగా పెట్టుకుంద‌ని మండిప‌డ్డారు. హిందూత్వ పేరుతో బీజేపీ అస‌త్యాలు ప్ర‌చారం చేస్తోందని ధ్వ‌జ‌మెత్తారు సిద్ద‌రామ‌య్య‌. హిందూయిజం, హిందుత్వం పూర్తిగా భిన్న‌మైనవ‌ని పేర్కొన్నారు మాజీ సీఎం. ప్ర‌జ‌లు పాల‌న‌ను గ‌మ‌నిస్తున్నార‌ని కాంగ్రెస్ కు ప‌ట్టం క‌ట్టేందుకు రెడీగా ఉన్నార‌ని చెప్పారు సిద్ద‌రామ‌య్య‌(Siddaramaiah).

Also Read : 2024 ఎన్నిక‌ల్లో బీజేపీకి షాక్ త‌ప్ప‌దు

Leave A Reply

Your Email Id will not be published!