Perni Nani Kotam Reddy : కోటంరెడ్డిపై పేర్ని నాని ఫైర్

త‌ప్పు చేయ‌క‌పోతే భ‌య‌మెందుకు

Perni Nani Kotam Reddy : మాజీ మంత్రి పేర్ని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై సీరియ‌స్ గా స్పందించారు. టికెట్ ఇచ్చి ఆద‌రించి పార్టీలో మంచి గుర్తింపు ఇచ్చిన త‌మ సీఎం జ‌గ‌న్ రెడ్డిని మోసం చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌ప్పు చేయ‌న‌ప్పుడు ఆ భ‌యం ఎందుకు ఉండాల‌ని ప్ర‌శ్నించారు మాజీ మంత్రి. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

త‌న ఫోన్ ను ట్యాపింగ్ చేసే అవ‌స‌రం రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఎందుకు ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు పేర్ని నాని. గురువారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. ఒక వేళ ఎమ్మెల్యేల‌పై నిఘా ఉన్న‌ట్లు భావిస్తే స‌రైన ఆధారాలు చూపించాల‌ని కోరారు.

ఎవ‌రైనా నేరుగా సీఎంతో మాట్లాడే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. కోటంరెడ్డి స్నేహితుడు రామ శివా రెడ్డి రికార్డ్ చేశారు. ఆయ‌నే అందరికీ ఆడియో పంపార‌ని దీని గురించి ఎమ్మెల్యే చెప్పాల‌ని అన్నారు పేర్ని నాని(Perni Nani).

టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడితో కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత ఈ ర‌కంగా నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేశారంటూ ఆవేద‌న చెందారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

త‌న‌ను స‌హ‌క‌రించిన వ్య‌క్తికి ఇలాగేనా న‌మ్మ‌క ద్రోహం చేసేది అంటూ ప్ర‌శ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. అంత‌కు ముందు నారా లోకేష్ ను కూడా క‌లిశార‌ని ఆ విష‌యం అంద‌రికీ తెలుస‌న్నారు. త‌మ ఎమ్మెల్యేలపై తామే ఎందుకు నిఘా పెట్టుకుంటామంటూ ఎదురు ప్ర‌శ్న వేశారు.

Also Read : హైకమాండ్ ఆదేశిస్తే పోటీకి సై

Leave A Reply

Your Email Id will not be published!