Akunuri Murali KCR : కేసీఆర్ మాయల మరాఠి – ఆకునూరి
మాజీ ఐఏఎస్ ఆఫీసర్ షాకింగ్ కామెంట్స్
Akunuri Murali KCR : మాజీ ఐఏఎస్ ఉన్నతాధికారి ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దున లేస్తే నిద్ర పోయేంత దాకా అబద్దాలు తప్ప నిజాలు మాట్లాడడం లేదన్నారు.
తెలంగాణ ఉద్యమం పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఇంకా చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. వేరే వాళ్లకు ఒక రూలు తనకు ఒక రూల్ ను అమలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు ఆకునూరి మురళి(Akunuri Murali) . రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి నాలుగు కోట్ల ప్రజలకు ఆదర్శంగా ఉండాలని కానీ ఏనాడో రాష్ట్రాన్ని మరిచి పోయారంటూ ఎద్దేవా చేశారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్. గతంలో ఎందరో సీఎంల వద్ద పని చేసినా ఇలాంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రాజనీతుజ్జుడిగా ఉండాలి కానీ సీఎం కేసీఆర్ మాయల మరాఠిగా మారి పోయారంటూ మండిపడ్డారు ఆకునూరి మురళి. ఎవరూ అడగరని, తనను నిలదీయడం లేదని విర్ర వీగుతున్నాడని సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణను అన్ని రంగాలను భ్రష్టు పట్టించిన ఘనత ఈ మహానుభావుడికే దక్కుతుందన్నారు.
దేశాన్ని సర్వ నాశనం చేసేందుకు బయలు దేరాడని, ఈ సందర్బంగా కొత్త వేషాలు వేస్తున్నాడని ఫైర్ అయ్యారు ఆకునూరి మురళి(Akunuri Murali) . ఇక మిగిలింది దోచుకున్నది చాలని దేశంపై పడ్డాడంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఆకునూరి మురళి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : ఇది కల్వకుంట్ల బడ్జెట్ – వైఎస్ షర్మిల