Aditya Convoy Attack : ఆదిత్యా ఠాక్రే కాన్వాయిపై రాళ్ల దాడి
దాడులకు భయపడమన్న శివసేన నేత
Aditya Convoy Attack : మరాఠాలో దాడుల పరంపర మొదలైంది. నిన్నటి దాకా మాటల యుద్దం నడిస్తే తాజాగా రాళ్ల దాడికి శివసేన అధినేత , యువ నాయకుడు ఆదిత్యా ఠాక్రే ప్రయాణిస్తున్న కాన్వాయ్ గురైంది. దీనిపై తీవ్రంగా స్పందించారు ఆదిత్యా ఠాక్రే. రాజకీయంగా తనను ఎదుర్కోలేని వాళ్లు, తన ఎదుగుదలను చూసి ఓర్వ లేని వారే ఇలా దాడులకు దిగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను భౌతికంగా లేకుండా చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. అయినా ఎన్ని దాడులకు పాల్పడినా తాను భయపడనంటూ ప్రకటించారు యువ నాయకుడు ఆదిత్యా ఠాక్రే. ఈ రాళ్ల దాడి(Aditya Convoy Attack) ఘటన కలకలం రేపింది. శివేసన బాల్ ఠాక్రే పార్టీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని కోరారు.
ఇదిలా ఉండగా ఘటన అనంతరం మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న దన్వే భద్రతా లోపాలపై మండిపడ్డారు. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కు ఫిర్యాదు చేశారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు.
ఇదిలా ఉండగా ఈ రాళ్ల దాడి ఘటన మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో ఆదిత్యా ఠాక్రే ప్రయాణిస్తున్న కారుపై నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారంటూ ఆ పార్టీ నాయకుడు అంబాదాస్ దాన్వే ఆరోపించారు. ఈ విషయాన్ని బుధవారం మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు.
Also Read : మహూవాపై హేమమాలిని ఫైర్