Chandrababu Naidu : ఎంత మంది వ‌స్తారో చూసుకుందాం

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు స‌వాల్

Chandrababu Naidu TDP : ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు కారాలు నూరుతున్నారు. గ‌న్న‌వ‌రంలో పార్టీ కార్యాల‌యాన్ని ప‌రిశీలించారు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu TDP) . ఈ సంద‌ర్భంగా పూర్తిగా ధ్వంసం చేయ‌డాన్ని తప్పుప‌ట్టారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. వైసీపీ స‌ర్కార్ , సీఎం జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఏకంగా స‌వాల్ కూడా విసిరారు. ఎంత మంది వ‌స్తారో రావాల‌ని తాము కూడా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామ‌ని చెప్పారు.

రోజు రోజుకు రాష్ట్రంలో బ‌తికే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వైసీపీ కావాల‌ని దాడుల‌కు దిగుతోంద‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మీకు ఎంత ద‌మ్ముందో త‌మ‌కు కూడా అంత ప‌వ‌ర్ ఉంద‌న్నారు. అందుకే గ‌న్న‌వ‌రం నుంచే తాను స‌వాల్ విస‌రుతున్నాన‌ని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

నేను బహిరంగంగా ప్ర‌క‌టిస్తున్నా టైం..డేట్ ఫిక్స్ చేయండి. నేను వ‌చ్చేందుకు రెడీ. ఎక్క‌డైనా స‌రే ఢీకొనేందుకు సిద్దంగా ఉన్నాన‌ని అన్నారు. ద‌మ్ముంటే బ‌హిరంగంగా రాజ‌కీయంగా ఎదుర్కోవాల‌ని కానీ ఇలా పార్టీ ఆఫీసుల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటే ఎలా అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ఫ్యాక్ష‌నిజం ఎక్కువైంద‌ని ఆరోపించారు. లా అండ్ ఆర్డ‌ర్ పూర్తిగా క్షీణించింద‌ని ఆరోపించారు చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu TDP). ఎన్ని వేల మంది వ‌చ్చినా త‌మ పార్టీకి చెందిన వారు ఢీకొనేందుకు సిద్దంగా ఉన్నార‌ని అన్నారు.

దొంగ దెబ్బ కొట్ట‌డం కాదు పోలీసుల‌ను వ‌దిలి వేసి రావాల‌ని ఛాలెంజ్ విసిరారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని ఆరోపించారు.

Also Read : బాబు నిర్వాకం గొడ‌వ‌ల‌కు కార‌ణం

Leave A Reply

Your Email Id will not be published!