UP CM Akhilesh : జో అప్నే బాప్ కా..యోగి ఫైర్

అఖిలేష్ పై మండిప‌డ్డ సీఎం

UP CM Akhilesh : యూపీ అసెంబ్లీలో మాట‌ల తూటాలు పేలాయి. సీఎం యోగి ఆదిత్యానాథ్ నిప్పులు చెరిగారు. సీరియ‌స్ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ సంద‌ర్భంగా మాజీ సీఎం , దివంగ‌త ములాయం సింగ్ యాద‌వ్ ను ప్ర‌స్తావించారు. మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ ను టార్గెట్ చేశారు. అసెంబ్లీలో చెడుగుడు ఆడాడు.

ఒక రోజు కిందట ప్ర‌యాగ్ రాజ్ లో కాల్చి చంప‌బడిన బీఎస్పీ ఎమ్మెల్యే హ‌త్య కేసులో సాక్షిని హ‌త్య చేయ‌డంపై విప‌క్షాలు యోగి స‌ర్కార్ ను నిల‌దీశాయి. అఖిలేష్ యాద‌వ్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు సీఎం. త‌న తండ్రితో త‌న‌కున్న వైరాన్ని కూడా ప్ర‌స్తావించారు యోగి ఆదిత్యానాథ్(UP CM Akhilesh).

బాధితురాలి కుటుంబం ఆరోపించిన అతిక్ అహ్మ‌ద్ స‌మాజ్ వాదీ పార్టీ పెంచి పోషిస్తున్న మాఫియాలో భాగ‌మ‌ని , దాని వెన్ను వెరిచే దిశ‌గా మాత్ర‌మే తాము ప‌ని చేశామ‌న్న‌ది నిజం కాదా అని ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా యోగి ఆదిత్యానాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. స్పీక‌ర్ సార్..అఖిలేష్ యాద‌వ్ అన్ని ప్రొఫెష‌న‌ల్ క్రిమిన‌ల్స్ , మాఫియాకు గాడ్ ఫాద‌ర్. వారి సిర‌ల్లో నేరాలు ఉన్నాయ‌ని. ఈ మాఫియాను నేల మీద‌కు దించుతాన‌ని అన్నారు.

ఈ సంద‌ర్భంగా జో ఆప్నే బాప్ కా అంటూ మ‌రోసారి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. అఖిలేష్ యాద‌వ్ కు(UP CM Akhilesh) నేరుగా వేలు చూపించ‌డం శాస‌న‌స‌భ‌లో క‌ల‌క‌లం రేపింది. అందుకే ఈసారి రాష్ట్రంలో బుల్ డోజ‌ర్ల‌ను దించాన‌ని అన్నారు సీఎం ఆదిత్యా నాథ్.

Also Read : ‘ఎస్పీ’ అవ‌మానం యోగి ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!