Kanna Lakshmi Narayana : జ‌గ‌న్ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు కాదు

మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ

Kanna Lakshmi Narayana : ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి , టీడీపీ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌. ఇటీవ‌లే ఆయ‌న బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

గ‌త కొంత కాలం నుంచీ జ‌గ‌న్ ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ కండువా క‌ప్పుకున్నాక మాట‌ల తీవ్ర‌త మ‌రింత పెరిగింది. ఈ త‌రుణంలో మాట‌ల డోస్ పెంచారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తండ్రికి త‌గ్గ త‌న‌యుడు కాడ‌ని అన్నారు. వైఎస్ పేరును చెడగొడుతున్నాడంటూ క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ మండిప‌డ్డారు.

దివంగ‌త త‌న తండ్రి కంటే గొప్ప‌గా పాల‌న అందిస్తాన‌ని ప్ర‌జ‌ల‌ను మోసం చేశాడ‌ని అన్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింద‌ని, కేవ‌లం ప్ర‌తీకారంతో ర‌గిలి పోతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జ‌ల పాలిట జ‌గ‌న్ రెడ్డి విల‌న్ గా మారాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్రజా స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలి వేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైఎస్ పేరును చెడ‌గొడుతున్నాడంటూ మండిప‌డ్డారు. ప్ర‌తీకార రాజ‌కీయాల‌తో చెల‌రేగి పోతున్నాడంటూ ఫైర్ అయ్యారు.

గ‌తంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను పూర్తిగా విస్మ‌రించాడంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆఫీసుల‌పై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయ‌కుండా బాధితుల‌నే అరెస్ట్ చేయ‌డం ఏమిట‌ని నిల‌దీశారు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌(Kanna Lakshmi Narayana). చ‌రిత్ర‌లో ఎక్క‌డా బాధితుల‌ను అరెస్ట్ చేయ‌డం లేదంటూ ఎద్దేవా చేశారు . సీఎంపై సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నార‌ని ఇదేనా డెమోక్ర‌సీ అని నిల‌దీశారు. 

Also Read : ఎంత మంది వ‌స్తారో చూసుకుందాం

Leave A Reply

Your Email Id will not be published!