G Kishan Reddy : ఇంటికో ఉద్యోగం ఎటు పోయింది

సీఎం కేసీఆర్ పై జి. కిష‌న్ రెడ్డి ఫైర్

G Kishan Reddy : తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి దూకుడు పెంచారు. ఆయ‌న ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. బండి సంజ‌య్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తే కిష‌న్ రెడ్డి(G Kishan Reddy) త‌న‌దైన శైలిలో దూసుకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ స‌ర్కార్ పై, సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు కిష‌న్ రెడ్డి.

G Kishan Reddy Asking

ఎన్నిక‌ల్లో లెక్క‌లేన‌న్ని హామీలు గుప్పించార‌ని అవ‌న్ని ఎందుకు అమ‌లు ప‌ర్చ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తాన‌ని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడ‌టం లేదంటూ నిల‌దీశారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివ‌ర్శిటీల్లో ఖాళీలు లెక్క‌లేన‌న్ని ఉన్నాయ‌ని వాటి ఊసెత్త‌క పోవ‌డం దారుణ‌మన్నారు. పొద్ద‌స్త‌మానం కేంద్రంపై ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌ప్ప చేసింది ఏమీ లేద‌న్నారు.

వ‌ర‌ద ప్రాంతాల్లో ఆదుకునేందుకు ఎవ‌రి ప‌ర్మిష‌న్ అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌స్తుతం ఎస్డీఆర్ఎఫ్ కింద రూ. 900 కోట్లు ఉన్నాయ‌ని ఇందులో 75 శాతం కేంద్రానిదైతే 25 శాతం రాష్ట్ర ప్ర‌భుత్వానిద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల దాకా ఖాళీలు ఉన్నాయ‌ని ఒక్క పోస్టు కూడా భ‌ర్తీ కాలేద‌న్నారు. ఏ ఒక్క ప‌రీక్ష స‌క్ర‌మంగా నిర్వహించిన దాఖ‌లాలు లేవ‌న్నారు. ప్ర‌భుత్వం మొద్దు నిద్ర పోతోంద‌ని , సీఎం ఫామ్ హౌస్ కే ప‌రిమిత‌య్యాడ‌ని ఆరోపించారు.

Also Read : Raghav Chadha : ప్ర‌మాదంలో ప్ర‌జాస్వామ్యం – రాఘ‌వ్ చ‌ద్దా

Leave A Reply

Your Email Id will not be published!