Chandra Babu Angallu Case : అంగళ్లు కేసులో తీర్పు రిజర్వ్
బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు
Chandra Babu Angallu Case : ఏపీ స్కిల్ స్కాం కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించి అంగళ్లు కేసులో గురువారం విచారణ జరిగింది. బాబు బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు ముగిశాయి. ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేశారు. శుక్రవారం తీర్పు చెప్పనున్నట్లు స్పష్టం చేసింది కోర్టు.
Chandra Babu Angallu Case Final Verdict
ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ మూడు కేసులు నమోదు చేసింది. ఒక్క ఏపీ స్కిల్ స్కాంలోనే రూ. 371 కోట్లు చేతులు మారాయని ఆరోపించింది. ఈ మేరకు పూర్తి నివేదికను ఏసీబీ కోర్టు ముందు ఉంచింది. దీంతో నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
అక్టోబర్ 19 వరకు రిమాండ్ విధించింది. దీనిని సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారించిన అనంతరం కొట్టి వేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంకా దీనిపై తుది తీర్పు వెలువడలేదు.
మరో వైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాం కేసుతో పాటు ఫైబర్ నెట్ స్కాం కేసులో కూడా చంద్రబాబు నాయుడును ప్రధాన నిందితుడిగా పేర్కొంది ఏపీ సీఐడీ. వీటన్నింటి నుంచి బెయిల్ కోసం దరఖాస్తు చేశారు టీడీపీ చీఫ్.
Also Read : Telangana DGP : తెలంగాణ డీజీపీతో ఐబీ చీఫ్ భేటీ