AP CM YS Jagan : పవన్ పై జగన్ సెటైర్
ఏపీలో ఇల్లు ఎక్కడ
AP CM YS Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన ఈసారి తన వాయిస్ ను పెంచారు. తనపై లేని పోని ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తూ వస్తున్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను ఏకి పారేశారు. హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు జగన్ రెడ్డి(AP CM YS Jagan). తమ ప్రభుత్వం వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఇలాంటి పథకాలు అమలు కావడం లేదన్నారు.
AP CM YS Jagan Shocking Comments
ఏనాడైనా ప్రజల గురించి చంద్రబాబు నాయుడు కానీ ఆయన స్వంత పుత్రుడు లోకేష్ కానీ, దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ ఆలోచించారా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలులో కనిపిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు జగన్ రెడ్డి.
చంద్రబాబు స్వంత నియోజకవర్గం కుప్పులో ఒక్కరికి కూడా ఇల్లు కట్టించిన పాపాన పోలేదన్నారు. వీరు ఎవరూ రాష్ట్రంలో ఉండరని , కానీ దోచుకునేందుకు, దాచుకునేందుకు మాత్రం ఏపీ కావాలని మండిపడ్డారు జగన్ రెడ్డి.
పవన్ కళ్యాణ్ ఇల్లు హైదరాబాద్ ఉన్నా ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు సంవత్సరాలకు మారి పోతుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయకులమైన మనమే భార్యలను మారిస్తే ఎలా అని ప్రశ్నించారు.
Also Read : Chandra Babu Angallu Case : అంగళ్లు కేసులో తీర్పు రిజర్వ్