Arvind Kejriwal: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై సీబీఐ చార్జిషీట్‌ !

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై సీబీఐ చార్జిషీట్‌ !

Arvind Kejriwal: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తోపాటు పలువురిపై సీబీఐ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ క్రమంలో మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సీఎం జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 25న పొడిగించిన విషయం తెలిసిందే. కేసు విచారణ ఆగస్టు 8న జరుగనున్నది. తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. తిహార్ జైలులోనే కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేసింది.

Arvind Kejriwal Case..

సీఎం కేజ్రీవాల్తో పాటు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరు నేతలకు జూలై 31 వరకు రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 31 వరకు కస్టడీని పొడిగించింది. ఇంతకు ముందు జూలై 12న సీబీఐ విచారిస్తున్న ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ను ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు హాజరుపరిచి కస్టడీని ఈ నెలాఖరు వరకు పొడిగించారు.

Also Read : Raitu Runa Mafi: లక్షన్నరలోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లోకి రేపే నిధులు జమ !

Leave A Reply

Your Email Id will not be published!