MK Stalin: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై మళ్లీ విరుచుకుపడ్డ స్టాలిన్

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై మళ్లీ విరుచుకుపడ్డ స్టాలిన్

MK Stalin : నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టిన ఎన్‌ఈపీ అనేది జాతీయ విద్యావిధానం కాదని, దేశవ్యాప్తంగా హిందీని వ్యాప్తి చేసేందుకు ఉద్దేశించిన ‘కాషాయ పార్టీ విధానం’ అని చెన్నైలో బుధవారంనాడు జరిగిన పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) మరోసారి కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విజన ప్రక్రియపై కూడా స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గెలవడం ద్వారా అధికారాన్ని స్థిరం చేసుకోవాలన్న ఆ పార్టీ ఆలోచనలో భాగమే ఈ ప్రక్రియ అని విమర్శించారు.

MK Stalin Slams

బీజేపీ తమకు ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలను పెంచుకుని, పార్టీని అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటోందని, ఈ ప్రయత్నాన్ని డీఎంకే అడ్డుకుంటుందని స్టాలిన్ స్పష్టం చేశారు. “ఎన్‌ఈపీని తమిళనాడు వ్యతిరేకిస్తోంది. ఇది తమిళనాడు విద్యా వృద్ధిని సమూలంగా నాశనం చేస్తుంది. సామాజిక న్యాయం అందించే రిజర్వేషన్లను ఎన్‌ఈపీ అంగీకరించదు. వృత్తివిద్య పేరుతో కుల ఆధారిత విద్యను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది” అని స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇది ఇలాఉండగా డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్న స్టాలిన్ దీనిపై కలిసిరావాలని ఏడు రాష్ట్రాలకు ఇప్పటికే లేఖలు రాశారు. అంతేకాదు తమ మంత్రుల బృందంలో కొంతమంది ముఖ్యమంత్రులు, కీలక పార్టీల నేతలను డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా చైన్నైలో నిర్వహిస్తున్న సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అన్ని విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి పార్లమెంటులో పోరాడాలని డీఎంకే ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు.

Also Read : Heart Attack: గుండెపోటుకు వ్యాక్సిన్‌ కనుగొన్న చైనా !

Leave A Reply

Your Email Id will not be published!