CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor)’ తో భారత్ పాక్ సరిహాద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ లో భాగాంగా పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాదుల స్థావరాలను భారత్ రక్షణ దళాలు నేలమట్టం చేసాయి. పదుల సంఖ్యలో ఉగ్రవాదులు ఈ దాడుల్లో మృతి చెందారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన ఈ అత్యవసర సమావేశానికి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డీజీపీ జితేందర్,హోం సెక్రటరీ రవి గుప్తా, ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

CM Revanth Reddy Orders…

ఈ సమావేశంలో పలు విభాగాల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. దేశ సైన్యంతో మనమంతా అండగా ఉన్నామనే సందేశం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీలకు తావులేదని స్పష్టం చేశారు. అత్యవసర సర్వీస్‌లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఉద్యోగులు అంతా ప్రభుత్వానికి అందుబాటులో ఉండాలని చెప్పారు. మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అసవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలని అన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలని అన్నారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వలు సిద్దం చేసుకోవాలని చెప్పారు. అత్యవసర మెడిసిన్ సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌ల అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రెడ్ క్రాస్ సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలని హెచ్చరించారు. ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఫేక్ న్యూస్‌ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకి అనుసంధానం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భధ్రతను పెంచాలని సూచించారు. హైదరాబాద్‌లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భధ్రతను పెంచాలని ఆదేశించారు. ఐటీ సంస్థల దగ్గర భద్రతను పెంచాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడాలని సూచించారు. రౌడీ‌షీటర్‌లపైన, పాత నేరస్తుల పట్ల పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

‘ఆపరేషన్‌ సిందూర్‌’ కు సంఘీభావంగా గురువారం భారీ ర్యాలీ

‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం(మే8) సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు,ఇతర నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గురువారం చేపట్టబోయే ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం 6గంటలకు హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌ నుంచి నెక్లెస్‌ రోడ్‌ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత పాల్గొని భారత సైన్యానికి నైతికంగా మద్దతు ఇవ్వాలని యువతకు విజ్ఞప్తి చేశారు.

Also Read : Operation Kagar: కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ ! 26 మంది మావోయిస్టులు మృతి !

Leave A Reply

Your Email Id will not be published!