Minister Nara Lokesh: ఉర్సా భూములపై జగన్‌ కు లోకేశ్‌ బహిరంగ సవాల్

ఉర్సా భూములపై జగన్‌ కు లోకేశ్‌ బహిరంగ సవాల్

Nara Lokesh : విశాఖలో ఉర్సా కంపెనీ భూ కేటాయింపులపై వైసీపీ(YCP) అధినేత జగన్ చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ఉర్సా కంపెనీకు ఎకరం భూమి రూపాయికి కట్టబెట్టినట్లు నిరూపిస్తే… తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వైఎస్‌ జగన్‌ కు మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) సవాల్‌ విసిరారు. ఒకవేళ ఆ ఆరోపణలు అబద్ధమని తేలితే… రాష్ట్ర యువతకు జగన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Minister Nara Lokesh Challenge

సోమవారం ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) స్పందిస్తూ… ‘‘విశాఖలో ఉర్సా కంపెనీకి రూపాయికే ఎకరం కట్టబెట్టారని జగన్‌ ఆరోపిస్తున్నారు. ఎకరం రూ. కోటి చొప్పున ఆ కంపెనీకి 3 ఎకరాలు కేటాయించాం. కాపులుప్పాడలో ఎకరం రూ.50లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్‌కు కొత్తేమీ కాదు. బురదజల్లి ప్యాలస్‌లో దాక్కోవడం కాదు… చేసిన ఆరోపణలు నిరూపించండి. సవాల్‌కి సిద్ధమా జగన్?’’అని లోకేశ్‌ పోస్టు చేశారు. ఈ మేరకు నారా లోకేష్ ‘ఫేక్.. ఫ్యాక్ట్’ అంటూ జగన్ ఫొటోతో కూడిన ఒక పోస్ట్ చేశారు.

‘మీ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతున్నాం. కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈనో వాడండి కాస్త రిలీఫ్ వస్తుంది.’ అంటూ సెటైరికల్ చురకలంటించారు నారా లోకేష్. మరి ఈ సవాల్‌ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారో.. లేదో చూడాలి.

అరాచక శక్తులను కాపాడటానికి రాజకీయాన్ని వాడుకోవద్దు – మంత్రి నాదేండ్ల

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) మంగళవారం తెనాలిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. సోమవారం విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకర్లతో మాట్లాడుతూ… తెనాలిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని పర్యటన చేయాలని వైఎస్ జగన్‌కు ఆయన సూచించారు. జగన్ ప్రభుత్వ హయాంలో తెనాలిని గంజాయి అడ్డగా మార్చేశారని విమర్శించారు. దీనితో పోలీసులు సైతం మిమ్మల్ని ఆపలేరనే విధంగా గంజాయి బ్యాచ్ తయారైందన్నారు.

గతంలో తన స్నేహితుడి కుమారుడిని సైతం అడ్డుకొని దాడి చేశారని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. అయితే ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి బహిరంగ సభలో ఐదు నిమిషాల్లోనే ఎన్నిక పూర్తయిపోతుందన్నారని… ఈ గంజాయి బ్యాచ్‌ను చూసుకునే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. లా అండ్ ఆర్డర్ అంటే ఈ బ్యాచ్‌‌కు భయం లేకుండా తయారయిందని చెప్పారు.

ఎన్నికల పోలింగ్ రోజు సుధాకర్ అనే వ్యక్తిని మీ పార్టీకి చెందిన గంజాయి బ్యాచ్ దాడి చేయడం నిజం కాదా? అని వైఎస్ ‌జగన్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ సూటిగా ప్రశ్నించారు. అరాచక శక్తులను కాపాడటానికి రాజకీయాన్ని వాడుకో వద్దంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు హితవు పలికారు. తెనాలి పర్యటనపై ఆలోచించుకోవాలని వైఎస్ జగన్‌ కు ఈ సందర్బంగా ఆయన కీలక సూచన చేశారు. గత ఐదేళ్లలో ఈ బ్యాచ్ ఎంత మందిని ఇబ్బంది పెట్టారన్నారు. ఇక తెనాలిలోని ఐతా నగర్‌ లో ఎంతో మంది తల్లులు భయబ్రాంతులకు గురయ్యారన్నారు.

గంజాయి మత్తు ద్వారా ఎంతో మంది యువత చెడు మార్గం పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి కోసం ఒక యువకుడు తల్లినీ కొట్టడానికి కూడా వెనకాడటం లేదన్నారు. వల్లభా పురం అనే గ్రామంలో గంజాయి విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని చెప్పారు. మీ హయంలో లా అండ్ ఆర్డర్ కోసం మీరు ఏమి చేశారంటూ వైఎస్ జగన్‌ను ఆయన సూటిగా నిలదీశారు. తెనాలిలో పర్యటించి వైఎస్ జగన్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. గతంలో అమలాపురంలో కులాలు మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూసిన విషయాన్ని అప్పుడే మర్చిపోయారా? అంటూ వైఎస్ జగన్‌కు మంత్రి నాదెండ్ల మనోహర్ చురకలంటించారు.

Also Read : Road Accident: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ! ఐదుగురి మృతి !

Leave A Reply

Your Email Id will not be published!