AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల ! టాప్‌-10లో అబ్బాయిలదే హవా !

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల ! టాప్‌-10లో అబ్బాయిలదే హవా !

AP EAPCET 2025 : ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ (ఏపీ ఈఏపీసెట్) ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ఎక్స్ వేదికగా విడుదల చేశారు. అదేసమయంలో జేఎన్టీయూ(JNTU) కాకినాడ వీసీ ప్రొ. సీఎస్ఆర్‌కే ప్రసాద్ తన కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ – ఫార్మసీ పలువురు విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టారు. ఇంజినీరింగ్‌ విభాగంలో హైదరాబాద్‌ వనస్థలిపురానికి చెందిన అవనగంటి అనిరుధ్‌ రెడ్డి ఒకటో ర్యాంకు (96.39 స్కోరు)తో సత్తా చాటగా… తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మాండవ్యపురం భాను చరణ్‌ రెడ్డి (95.57 స్కోరు)తో రెండో ర్యాంకు, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కోటిపల్లి యశ్వంత్‌ సాత్విక్‌ (94.75స్కోరు)తో మూడో ర్యాంకుతో మెరిశారు.

AP EAPCET 2025 Updates

ఇక మహానందికి చెందిన రాంచరణ్ రెడ్డికి నాలుగో ర్యాంకు, అనంతపూర్‌ కు చెందిన భూపతి నితిన్ అగ్రిహోత్రికి ఐదో ర్యాంకు, గుంటూరుకు చెందిన విక్రమ్‌ కు ఆరో ర్యాంకు, చిత్తూరుకు చెందిన మణిదీప్ రెడ్డికి ఏడో ర్యాంకు, తెలంగాణ హన్మకొండకు చెందిన షాగంటి త్రిశూల్‌ కు ఎనిమిదో ర్యాంకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన జ్ఞాన రుత్విక్ సాయికి తొమ్మిదో ర్యాంకు, నెల్లూరు జిల్లా సాయి మణి ప్రీతమ్‌‌ పదో ర్యాంకు కైవసం చేసుకున్నారు.

యు. రామచరణ్‌ రెడ్డి – నాలుగో ర్యాంకు (తిమ్మాపురం, నంద్యాల జిల్లా)
భూపతి నితిన్‌ అగ్నిహోత్రి – ఐదో ర్యాంకు (అనంతపురం న్యూటౌన్‌)
టి.విక్రమ్‌ లేవి – ఆరో ర్యాంకు (గుంటూరు)
దేశిరెడ్డి మణిదీప్‌ రెడ్డి – ఏడో ర్యాంకు (చిత్తూరు జిల్లా)
ఎస్‌. త్రిశూల్‌ – ఎనిమిదో ర్యాంకు (వడ్డేపల్లి, హన్మకొండ)
ధర్మాన జ్ఞాన రుత్విక్‌ సాయి – తొమ్మిదో ర్యాంకు (నరసన్నపేట- శ్రీకాకుళం)
భద్రిరాజు వెంకటమణి ప్రీతమ్‌ – పదో ర్యాంకు ( కందుకూరు- పొట్టిశ్రీరాములు నెల్లూరు)

అగ్రికల్చరల్‌ లో కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన వెంకట నాగసాయి హర్షవర్ధన్ మొదటి ర్యాంకు సాధించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన షణ్ముఖ నిషాంత్ రెడ్టి రెండో ర్యాంకు, ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన డేగల వినయ్ మల్లేష్ కుమార్ మూడో ర్యాంకు సాధించారు.

అగ్రికల్చర్‌, ఫార్మా విభాగంలో టాపర్లు వీరే

1. రామాయణం వెంకట నాగసాయి హర్షవర్దన్‌- (పెనమలూరు, కృష్ణా జిల్లా)

2. షన్ముఖ నిశాంత్‌ అక్షింతల – చందానగర్‌, రంగారెడ్డి జిల్లా

3. డేగల అకీరనంద వినయ్‌ మల్లేశ్‌ కుమార్‌ – ఆలమూరు, కోనసీమ

4. వై.షణ్ముఖ్‌ – వడ్డేపల్లి, హన్మకొండ

5. యెలమోలు సత్య వెంకట్‌ – తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి

6. సిరిదెళ్ల శ్రీ సాయి గోవర్దన్‌ – పెద్దాపురం, కాకినాడ

7. జి. లక్ష్మీ చరణ్‌ – సీతమ్మధార, విశాఖ

8. దర్భ కార్తిక్‌ రామ్‌ కిరీటి- రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి

9. కొడవటి మోహిత్‌ శ్రీరామ్‌ – చాగళ్లు, తూర్పుగోదావరి

10. దేశిన సూర్య చరణ్‌ – తొండంగి, కాకినాడ

ఏపీ ఈఏపీసెట్ 2025కు(AP EAPCET 2025) నిర్వహించిన పరీక్షల్లో ఇంజనీరింగ్ విభాగానికి మొత్తం 2.64 లక్షల మంది హాజరయ్యారు. 1.8 లక్షల మంది అర్హత సాధించారు. 71.65 శాతం మంది పాసయ్యారు.

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో నిర్వహించిన పరీక్షల్లో 75.4 వేల మంది హాజరయ్యారు. వారిలో 67.7 శాతం మంది అర్హత సాధించారు. 89.8 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

Also Read : Pawan Kalyan : అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు

Leave A Reply

Your Email Id will not be published!