Journalist Krishnam Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్

Journalist Krishnam Raju : ‘అమరావతి దేవతల రాజధాని కాదు… వేశ్యల రాజధాని’ అంటూ సాక్షి డిబేట్ లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో కలిసి మహిళల అత్మగౌరవన్ని దెబ్బతీసేలా, తీవ్ర అవమానాలకు గురిచేసేలా అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును(Journalist Krishnam Raju) పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న… అతన్ని బుధవారం రాత్రి భీమిలి గోస్తనీనది సమీపంలో సెల్ టవర్ లోకేషన్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణంరాజు వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురినీ విశాఖ నుంచి విజయవాడ తరలించారు.

Journalist Krishnam Raju Arrested

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించి చర్చ కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడుతూ… రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతని వ్యాఖ్యలను యాంకర్ కొమ్మినేని ఖండించకపోగా… నేను కూడా ఈ విషయం పత్రికల్లో చూసాను అంటూ సమర్ధించారు. అయితే వీరు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తం ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ క్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజుతోపాటు సాక్షి యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రజలు ఆందోళనలు చేపట్టారు.

అంతేకాదు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ మ్యాగజైన్ ఎడిటర్ వీవీఆర్ కృష్ణంరాజు, సాక్షి టీవీ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావుపై మాదిగ కార్పోరేషన్ చైర్మన్ శిరీష ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేయగా.. మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ సైతం స్పందించింది. ఈ వ్యాఖ్యలపై జాతీయ మానవ హక్కుల సంఘానికి టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఫిర్యాదు చేశారు.

Also Read : Telangana New Ministers: తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు

Leave A Reply

Your Email Id will not be published!