Air India: విమానంలో లోపం ఉందని ముందే చెప్పిన ప్రయాణీకుడు ! పట్టించుకోని ఎయిర్ ఇండియా ?

విమానంలో లోపం ఉందని ముందే చెప్పిన ప్రయాణీకుడు ! పట్టించుకోని ఎయిర్ ఇండియా ?

Air India : అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 242 మంది ప్రయాణికులతోపాటు సిబ్బంది మరణించారు. అయితే ఈ విమానంలో లోపం ఉన్నట్లు ముందే ఓ ప్రయాణికుడు సందేహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తన ఎక్స్ ఖాతా వేదికగా ఎయిర్ ఇండియా సంస్థకు సమాచారం అందించినట్లు తెలిపారు.

Air India Nedligence

ప్రమాదానికి గురైన ఎయిరిండియా-171 విమానం… న్యూఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్లనుంది. అకాష్ అనే వ్యక్తి న్యూఢిల్లీలో ఈ విమానం ఎక్కారు. అతడు అహ్మదాబాద్‌ లో దిగిపోయారు. ఆ క్రమంలో ఈ విమానంలో లోపం ఉందంటూ అతడు ముందే ఎయిర్ ఇండియాకు (Air India) సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆకాష్ … తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరోవైపు ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఇదే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. 2024 జూన్‌ 6, డిసెంబర్‌లో… రెండుసార్లు ఈ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సాంకేతిక సమస్యపై ఎయిర్ ఇండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేఖ రాసింది. అయితే ఈ లేఖను ఎయిర్ ఇండియా సంస్థ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చివరగా మూడో సారి అంటే ఈ రోజు అదే ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది.

Also Read : Doctor Family: లండన్‌ లో సెటిల్ అవుదామని బయలుదేరి బూడిదైన డాక్టర్ కుటుంబం

Leave A Reply

Your Email Id will not be published!