తమిళనాడు : తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఈ సందర్బంగా ఎన్నికల ఫలితాలపై స్పందించారు మాజీ సీఎం ఎంకే స్టాలిన్. ప్రజల తీర్పును తలవంచి స్వీకరిస్తున్నామని చెప్పారు. విజేతలకు అభినందనలు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో తాము ఎన్నో పథకాలను రూపొందించి తమిళనాడు ప్రజలకు సుపరిపాలన అందించామన్నారు. తాము తమిళనాడును అన్ని విధాలుగా ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లామని తెలిపారు మాజీ సీఎం. ఎన్నికల బరిలో మా విజయాల గురించి చెబుతూ ఓట్లు అడిగామన్నారు. ప్రజలకు తాము అందించిన సంక్షేమ పథకాలను కొనసాగించడానికి ఓట్ల కోసం ప్రచారం చేశామన్నారు ఎంకే స్టాలిన్. ద్రవిడ మున్నేట్ర కజగం నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్కు మద్దతుగా ఓటు వేసిన తమిళనాడు ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఓటు వేసిన వారినే కాకుండా, ఓటు వేయడం మరిచి పోయిన వారిని కూడా కలుపుకొని నేను పాలించాను. నేను ప్రజలందరికీ నిజయితీగా ఉన్నాను. నా మనస్సాక్షికి అనుగుణంగా నడుచుకున్నాను. నా సామర్థ్యానికి మించి పని చేశానని చెప్పాడు ఎంకే స్టాలిన్. నాతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసి, నా జీవితంతో పెనవేసుకు పోయిన నాయకుడు కళైజ్ఞర్ ప్రియమైన సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మాతో భుజం భుజం కలిపి నిలిచిన కామ్రేడ్షిప్ ఉద్యమ నాయకులు, నిర్వాహకులు, వాలంటీర్లందరికీ ధన్యవాదాలు. నా రాజకీయ జీవితంలో నేను ఎన్నో విజయాలు చూశాను, అపజయాలను కూడా చవిచూశాను. అందువల్ల, నేను కేవలం గెలుపు ఓటములను కాకుండా, ఆదర్శం , విధానం రెండూ ముఖ్యమని భావించి వ్యవహరించగలను అని స్పష్టం చేశారు. అందువల్ల, ద్రవిడ మున్నేట్ర కజగం రాజకీయ ప్రస్థానం నిరాటంకంగా కొనసాగుతుందని ప్రకటించారు.
