RK Roja : మహా నేత ఆశీస్సుల వ‌ల్లే మంత్రి ప‌ద‌వి

వైఎస్సార్ కు నివాళులు అర్పించిన రోజా

RK Roja : కేబినెట్ మంత్రిగా కొలువు తీరిన ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి (RK Roja)ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను ఎంద‌రో ఇబ్బందుల‌కు గురి చేశార‌ని, మ‌రెంద‌రో ఐర‌న్ లెగ్ అంటూ గేలి చేశార‌ని ఆవేద‌న చెందారు.

కానీ వాట‌న్నింటిని త‌ట్టుకుని నిల‌బ‌డ్డాన‌ని చెప్పారు. మ‌హా నాయ‌కుడు దివంగ‌త వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి ఆశీస్సులు, జ‌గ‌న‌న్న అండ‌దండ‌ల‌తో తాను ఈ స్థాయికి చేరుకున్నాన‌ని తెలిపారు.

ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా కొలువు తీరిన అనంత‌రం రోజా క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ‌లో వైఎస్సార్ కు నివాళులు అర్పించారు. అనంత‌రం మీడియాతో ఆర్కే రోజా మాట్లాడారు.

క‌డ‌ప నా స్వ‌స్థ‌లం. న‌ర న‌రాన ఇక్క‌డి ర‌క్తం నాలో ఉందన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే వైఎస్సార్ త‌న‌ను పార్టీ లోకి చేర‌మ‌ని కోరార‌ని తెలిపారు రోజా.

ఆయ‌న‌తో క‌లిసి రాజ‌కీయాల్లో ప‌ని చేయాల‌ని అనుకున్నా. కానీ అవ‌కాశం రాలేద‌న్నారు. వైఎస్సార్ అకాల మ‌ర‌ణంతో చాలా బాధ ప‌డ్డాన‌ని చెప్పారు మంత్రి. ఆయ‌న ఆశ‌యాల సాధ‌న కోసం పుట్టిందే వైఎస్సార్ సీపీ పార్టీ .

ఆయ‌న భౌతికంగా లేక పోయినా వైఎస్సార్ ఆశీస్సులు ఎల్ల‌ప్పుడూ త‌న‌కు ఉంటాయ‌ని అన్నారు. త‌న జీవితంలో ఒక్క‌సారైనా ఎమ్మెల్యే కావాల‌ని కోరిక ఉండేద‌న్నారు. కానీ దేవుడి ద‌య వ‌ల్ల జ‌గ‌న్ స‌హ‌కారం వ‌ల్ల రెండు సార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించా.

ఇప్పుడు జ‌గ‌న‌న్న దీవెన‌ల‌తో ఏకంగా మంత్రి ప‌ద‌వి అలంక‌రించా. వైఎస్ కుటుంబానికి జ‌న్మ జ‌న్మ‌లా రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.

Also Read : మ‌హోన్న‌త మాన‌వుడు అంబేద్క‌ర్

Leave A Reply

Your Email Id will not be published!