Salman Khan : ఆ మూవీ త‌ర్వాత‌ ఇబ్బంది ప‌డ్డా

బాలీవుడ్ నటుడు ఖాన్ భావోద్వేగం

Salman Khan : బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భార‌తీయ సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపింది. సెన్సేష‌న్ క్రియేట్ చేసింది మైనే ప్యార్ కియా. ఇందులో స‌ల్మాన్ ఖాన్, భాగ్య‌శ్రీ న‌టించారు.

ప్ర‌త్యేకంగా దివంగ‌త గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం, ల‌తా మంగేష్క‌ర్ పాడిన పాట‌లు జ‌నాద‌ర‌ణ పొందాయి. ఆయ‌న గొంతు స‌ల్మాన్ ఖాన్ కు స‌రిగ్గా స‌రి పోయింది.

ఈ త‌రుణంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు న‌టుడు స‌ల్మాన్ ఖాన్(Salman Khan) . త‌న జీవితంలో మైనే ప్యారే కియా మూవీ మ‌రిచి పోలేన‌ని అన్నారు. కానీ ఈ సినిమా త‌ర్వాత త‌న‌కు సినిమాలు చేసేందుకు చాలా ఇబ్బంది ప‌డ్డాన‌ని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు.

దీంతో స‌హ న‌టీన‌టులు విస్తు పోయారు స‌ల్మాన్ కామెంట్స్ కు. మైనే ప్యార్ కియా బిగ్ హిట్. కానీ కొత్త సినిమా కోసం ఆరు నెల‌ల పాటు వేచి ఉండాల్సి వ‌చ్చింద‌న్నాడు. త‌న‌తో పాటు న‌టించిన భాగ్య‌శ్రీ పెళ్లి చేసుకునేందుకు న‌ట‌న‌ను వ‌దిలి వేస్తున్నాన‌ని ప్ర‌క‌టించింది.

దీంతో ఈ మూవీ స‌క్సెస్ క్రెడిట్ అంతా ఆమెకే వెళ్లింద‌న్నాడు. ఆ త‌రుణంలో తాను సినిమాల‌లో న‌టించేందుకు నానా తంటాలు ప‌డాల్సి వ‌చ్చింద‌ని చెప్పాడు.

క‌న్నీళ్లు పెట్టుకున్న ఘ‌ట‌న అబుదాబిలో జ‌రిగింది. ఇటీవ‌ల ఇంట‌ర్నేష‌న‌ల్ ఇండియ‌న్ ఫిల్మ్ అకాడ‌మీ అవార్డు వేడుక‌లు జ‌రిగాయి. వీటికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు స‌ల్మాన్ ఖాన్.

ఆ స‌మ‌యంలో త‌న‌ను ఆదుకున్న‌ది చిత్ర నిర్మాత ర‌మేష్ తౌరానీ అని చెప్పాడు. 1991లో ప‌త్త‌ర్ కే పూల్ చేశాన‌ని చెప్పాడు స‌ల్మాన్ ఖాన్.

Also Read : ఘ‌నంగా ఎంటీవీ అవార్డుల ఉత్స‌వం

Leave A Reply

Your Email Id will not be published!