Rahul Gandhi : రెచ్చ గొట్ట‌డంలో బీజేపీ నేత‌లు ముదుర్లు

ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగిన నేత

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న బీజేపీని, ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేశారు. ఆయ‌న ప‌రివారం మొత్తం రెచ్చగొట్టేలా వ్యాఖ్య‌లు చేయ‌డంలో ఆరి తేరిన వారంటూ ఆరోపించారు.

ఈ మేర‌కు వారు చేసిన ట్వీట్ల‌ను ఈ సంద‌ర్భంగా ట్వీట్ లో జ‌త చేర్చారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఇప్ప‌టికే బీజేపీ నుంచి బ‌హిష్క‌రించ బ‌డిన నూపుర్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ప్ర‌పంచ వ్యాప్తంగా 57 ముస్లిం దేశాలు తీవ్ర అభ్యంత‌రం తెలిపాయి. ఏకంగా భార‌త దేశం క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశాయి. ప‌నిలో ప‌నిగా భార‌త్ ఉత్ప‌త్తులు నిషేధించాల‌ని కొన్ని దేశాలు పిలుపు కూడా ఇచ్చాయి.

ఈ త‌రుణంలో తాజాగా అల్ ఖైదా సంస్థ ఆత్మాహుతి దాడుల‌కు పాల్ప‌డుతామంటూ హెచ్చ‌రించింది. ప్ర‌ధానంగా ఢిల్లీ, ముంబై, ఉత్త‌ర ప్ర‌దేశ్ , గుజ‌రాత్ ల‌లో దాడుల‌కు పాల్ప‌డుతామ‌ని వార్నింగ్ ఇచ్చింది.

దీంతో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది. ఈ త‌రుణంలో నోరు పారేసుకున్న నాయ‌కుల వెనుక అలా మాట్లాడించింది ఎవ‌రో ముందు తేలాల‌న్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).

నూపుర్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ కాకుండా మైనార్టీ వ‌ర్గాలు, మ‌హిళ‌ల గురించి మ‌రికొంద‌రు నేత‌లు అవమాన‌క‌రంగా వ్యాఖ్య‌లు చేశారంటూ ఆరోపించారు. వారు చేసిన కామెంట్స్ తో కూడిన గ్రాఫిక్స్ ను కూడా పంచుకున్నారు.

కేంద్ర మంత్రి అమిత్ షా బంగ్లాదేశ్ వల‌సదారుల‌ను చెద పురుగులు అన్నార‌ని, అనురాగ్ ఠాగూర్ దేశ ద్రోహుల‌ను కాల్చి చంపాల‌ని పిలుపునిచ్చారంటూ పేర్కొన్నారు.

యూపీ సీఎం మ‌హిళ‌ల‌ను చుల‌క‌న‌గా మాట్లాడారంటూ పేర్కొన్నారు. భోపాల్ ఎంపీ సాధ్వి ప్ర‌గ్యా గాంధీని చంపిన గాడ్సేను కీర్తించారంటూ తెలిపారు.

Also Read : స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం

Leave A Reply

Your Email Id will not be published!