Pulwama Encounter : పుల్వామాలో ల‌ష్క‌ర్ ఉగ్ర‌వాదులు హ‌తం

ముగ్గురు టెర్ర‌రిస్టులు ఎన్ కౌంట‌ర్

Pulwama Encounter : జ‌మ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జ‌రిగిన ఎన్ కౌంట‌ర్ లో ముగ్గురు ల‌ష్క‌ర్ ఉగ్ర‌వాదులు హ‌తమ‌య్యారు. ఈ ఘ‌ట‌న గురించి కాశ్మీర్ జోన్ చీఫ్ ధ్రువీక‌రించారు.

ఈ మేర‌కు ట్వీట్ చేశారు. పుల్వామా(Pulwama Encounter)లోని ద్రాబ్ గామ్ ప్రాంతంలో ఈ ఎన్ కౌంట‌ర్ చోటు చేసుకుంది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని క‌లిగి ఉన్నారు.

టెర్ర‌రిస్టుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. ఉగ్ర‌వాదుల్లో ఒక‌రి పేరు జునైద్ షీర్గోజ్రీగా గుర్తించిన‌ట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురు హ‌త‌మ‌య్యార‌ని తెలిపారు.

ఉగ్ర‌వాద సంస్థ ల‌ష్క‌రే తోయిబాతో సంబంధం క‌లిగి ఉన్నారు. మే 13న రియాజ్ అహ్మ‌ద్ ను హ‌త‌మార్చ‌డంలో ప్ర‌మేయం ఉన్నట్లుగా గుర్తించిన‌ట్లు ఇన్ స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) వెల్ల‌డించారు.

అంత‌కు ముందు ఒక ఉగ్ర‌వాదిని హ‌త‌మార్చారు. కొన్ని గంట‌ల పాటు కొన‌సాగింది. ఇదిలా ఉండ‌గా పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు ఇటీవ‌ల మ‌రోసారి రెచ్చి పోయారు. ఇటీవ‌ల వ‌రుస ఘ‌ట‌న‌లు తీవ్ర ఇబ్బందులు క‌లిగించేలా చేసింది.

దీనిపై కేంద్ర హొం శాఖ సీరియ‌స్ గా మీటింగ్ చేప‌ట్టారు. గ‌త నెల రోజుల్లో 8 మందికి పైగా క‌శ్మీర్ లో హిందువులు, పండిట్ల‌ను టార్గెట్ గా పెట్టుకుని కాల్పుల‌కు తెగ బ‌డ్డారు.

ఇందులో ఓ ప్ర‌భుత్వ టీచ‌ర్, ప్ర‌భుత్వ బ్యాంక్ మేనేజ‌ర్ తో పాటు బీహార్ కు చెందిన కార్మికుడిని పొట్ట‌న పెట్టుకున్నారు. ఈ వ‌రుస ఘ‌ట‌న‌ల‌పై ఫోక‌స్ పెట్టిన భార‌త ఆర్మీ ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది. విస్తృతంగా సోదాలు చేప‌డుతోంది.

Also Read : కాశ్మీరీ యూట్యూబ‌ర్ ఫైస‌ల్ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!